Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
చనిపోయేలోపైనా సంతోషంగా గడపాలని ఉక్రెయిన్ యువత కోరుకుంటోంది. ఏళ్లుగా డేటింగ్లో ఉన్నవారు, కొత్త ప్రేమ జంటలు ప్రస్తుతం వివాహ బంధంతో ఒక్కటవుతున్నాయి.......
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ యుద్ధం వేలాది అమాయకులను పొట్టనపెట్టుకుంది. ఎన్నో లక్ష్యాలు, మరెన్నో ఆశలతో ముందుకు సాగాలనుకున్న అనేకమంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఎప్పుడు ఏ బాంబు మీదొచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. చనిపోయేలోపైనా సంతోషంగా గడపాలని అక్కడి యువత కోరుకుంటోంది. ఏళ్లుగా డేటింగ్లో ఉన్నవారు, కొత్త ప్రేమ జంటలు ప్రస్తుతం వివాహ బంధంతో ఒక్కటవుతున్నాయి. కొద్దిరోజులుగా ఉక్రెయిన్లో (Ukraine) వేలాది వివాహాలు జరుగుతున్నాయి.
ఓవైపు రష్యా (Russia) దండయాత్ర సాగిస్తుండగానే.. హింసాత్మక వాతావరణంలోనే ఉక్రెయిన్ జంటలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన రోజునే ఇహోర్ జక్వాట్స్కీ అనే యువకుడు కేథరీనా లైట్వినెంకోకు తన ప్రేమను తెలియజేశాడు. అయితే ఆ యుద్ధం వారిని విడదీసింది. ఇన్నిరోజులుగా దూరంగా ఉన్న జంట తాజాగా కీవ్లో వివాహామాడింది. యుద్ధం కారణంగా ఎప్పుడు చనిపోతామో తెలియదని, ఈలోపైనా కలిసి బతకాలని కోరుకుంటున్నట్లు ఆ జంట తెలిపింది. అంతా కలిసొస్తే జీవితం కొనసాగిస్తామని, లేదంటే భార్యాభర్తలుగా చనిపోతామని పేర్కొంది. కొందరు సైనికులు వివాహం చేసుకున్న తర్వాతే కదన రంగంలోకి అడుగుపెడుతున్నారు.
గత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న నెల రోజుల తర్వాతే వివాహం చేసుకోవాల్సి ఉండేది. అయితే ఉక్రెయిన్లో ప్రస్తుతం మార్షల్ లా కొనసాగుతోంది. సైనికులు, సాధారణ పౌరుల వివాహాలకు ఈ చట్టంలో వెసులుబాటు కల్పించింది. అదే రోజు దరఖాస్తు చేసుకొని, వివాహం పూర్తి చేసుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తోంది. దీంతో రాజధాని కీవ్లోనే నాలుగు వేలకు పైగా జంటలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాయి. ఏప్రిల్లో రష్యా సేనలు కీవ్ పరిసరాల నుంచి వైదొలిగాక వివాహాలు జోరందుకున్నాయి. వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లిన చాలా మంది ఉక్రెయిన్కు తిరిగొచ్చారు.
‘రేపు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే త్వరగా వివాహం చేసుకున్నాం’ అని మరో కొత్త జంట తెలిపింది. యుద్ధం నేపథ్యంలో పోలాండ్కు వెళ్లిపోయిన డేరియా పొనోమకెరెంకో(22) ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చింది. ఉక్రెయిన్లోనే ఉండిపోవాల్సి వచ్చిన తన బాయ్ఫ్రెండ్ యెవ్హెన్ నాలివైకో(23)ను కలుసుకొంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ జంట ఓ చర్చిలో వివాహమాడింది. కోరుకున్న వ్యక్తితో కొద్దికాలమైనా సంతోషంగా గడపాలనుకుంటున్నానని పొనోమకెరెంకో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM