Tangaraju: గంజాయి అక్రమ రవాణా.. ఉరికంబం ఎక్కనున్న భారత సంతతి వ్యక్తి
గంజాయి అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యకు పడిన ఉరిశిక్షను బుధవారం అమలు చేసేందుకు సింగపూర్ (Singapore) సిద్ధమైంది.
సింగపూర్: గంజాయి అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేసేందుకు సింగపూర్ (Singapore) సిద్ధమైంది. బుధవారం ఉరిశిక్షను వేయనుంది. మరణశిక్షను తగ్గించుకునేందుకు న్యాయపరంగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అమలు ఖాయమైంది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో భారత సంతతి మలేసియన్ నాగేంద్రన్ ధర్మలింగంకు సింగపూర్ గతేడాది ఉరిశిక్షను అమలు చేసింది. తాజాగా గంజాయి కేసులో తంగరాజ్ను ఉరితీయనుంది.
భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య (Tangaraju Suppiah).. గంజాయి అక్రమ రవాణా కేసులో 2014లో అరెస్టయ్యాడు. ఒక కిలో గంజాయిని సింగపూర్కు అక్రమంగా తరలిస్తున్నాడన్న అభియోగాలు అతడిపై నమోదయ్యాయి. ఈ కేసులో అతడికి అక్టోబర్ 9, 2018లో మరణశిక్ష పడింది. మరో ఇద్దరితో కలిసి తంగరాజు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించినట్లు నిర్ధారించిన న్యాయస్థానం.. అతడికి శిక్ష విధించింది. ఈ క్రమంలోనే తంగరాజును బుధవారం ఉరితీసేందుకు సింగపూర్ ఏర్పాట్లు చేసింది.
వ్యతిరేకించిన బ్రిటిష్ బిలియనీర్..
తంగరాజ్కు ఉరిశిక్ష అమలు చేయడాన్ని బ్రిటన్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓ అమాయకుడిని సింగపూర్ చంపబోతోందని వ్యాఖ్యానించిన ఆయన.. ప్రమాణాలకు అనుగుణంగా తంగరాజ్ కేసు విచారణ జరగలేదని ఆరోపిస్తూ తన బ్లాగ్లో అభిప్రాయపడ్డారు. బ్రాన్సన్కు యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా కూడా మద్దతుగా నిలిచాయి. తంగరాజ్ ఉరిని నిలిపేయాలంటూ నార్వే, స్విట్జర్లాండ్ దౌత్యవేత్తలు సింగపూర్కు విజ్ఞప్తి చేశారు. అతడి ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని సూచించాయి.
స్థానిక చట్టాల ప్రకారమే..
ఈ వివాదంపై సింగపూర్ హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటనను తీవ్రంగా తప్పుపట్టిన హోంశాఖ.. ఆయన వ్యాఖ్యలు సింగపూర్ న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరిచేలా ఉన్నాయని మండిపడింది. అలాంటి ప్రకటన చేసేముందు కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. సింగపూర్కు గంజాయి తరలించే ఉద్దేశం తంగరాజుకు ఉందని.. అందులో భాగంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిపినట్లు తేలిందని వెల్లడించింది. మాదకద్రవ్యాలకు సంబంధించి స్థానిక చట్టాల ప్రకారమే అతడికి ఉరిశిక్ష అమలు చేస్తున్నామని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
వేర్పాటువాదానికి, హింసను సమర్థించేవారికి మద్దతు ఇవ్వడమనేది భావప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని కేంద్ర మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. -
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
వివాహ బంధంలో కొత్త ట్రెండ్ను ఫాలో అవుతోన్న జపాన్ యువత.. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ధోరణి వైపు అడుగులు వేస్తోంది. -
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. -
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది. -
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం