America: అమెరికాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి!

అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ కుటుంబం ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  

Published : 07 Oct 2023 04:39 IST

న్యూయార్క్‌: అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే తేజ్‌ ప్రతాప్‌ సింగ్‌ (43), ఆయన భార్య సోనాల్‌ పరిహర్‌(42), వారి పదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె వారి ఇంట్లోనే విగతజీవులుగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. తేజ్‌ ప్రతాప్‌ కుటుంబం ఎలా ఉందో కనుక్కొమంటూ అతడి బంధువుల్లో ఒకరు పోలీసులను కోరారు. దీంతో వారు తేజ్‌ప్రతాప్‌ ఇంటికి చేరుకోగా.. ఈ దారుణం వెలుగుచూసింది.

ప్రతాప్ సింగ్ తొలుత కుటుంబసభ్యుల్ని చంపి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంతోపాటు, హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. తేజ్‌ ప్రతాప్‌ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేదని, వారంతా కమ్యూనిటీలోని అందరితో స్నేహపూర్వకంగానే మెలిగేవారని స్థానికులు చెబుతున్నారు. ఇంత ఘోరం జరుగుతుందని తాము ఊహించలేదన్నారు. తేజ్‌ ప్రతాప్‌ ఓ ఐటీ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తుండగా.. ఆయన భార్య కూడా మరో ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంతకిమించి వివరాలేమీ ఇంకా తెలియరాలేదని ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని