‘పెళ్లి చేసుకోమని ఆమెను 5 సార్లు అడిగా’: జో-జిల్ ప్రేమ కహానీ ఇదే..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్(Joe Biden-Jill Biden) తమ ప్రేమ ముచ్చట్లు వెల్లడించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలని చూస్తున్న జో బైడెన్(Joe Biden) తన జీవితంలోని మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. తన సతీమణి జిల్ బైడెన్(Jill Biden)తో ప్రేమలో పడిన రోజుల్ని అమెరికన్లతో పంచుకున్నారు. వాలెంటైన్స్ డేన ‘మీట్ క్యూట్స్ ఎన్వైసీ’(Meet Cutes NYC) ఇన్స్టా వేదికగా తమ ప్రేమను బయటపెట్టారు.
జో, జిల్ వివాహబంధంలోకి అడుగుపెట్టి 48 ఏళ్లు కావొస్తోంది. వారిద్దరూ మొదటిసారి కలుసుకున్న సందర్భం.. ఆ తర్వాత పరిచయం బంధంగా ముడిపడిన విషయాలను వెల్లడించారు. 1975లో వారిద్దరూ మొదటిసారి మీట్ అయ్యారు. అప్పుడు జో వయసు 33. సెనెటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 24 ఏళ్ల జిల్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని. వారిద్దరి పరిచయానికి కారణమైంది మాత్రం జో(Joe Biden) సోదరుడు. ‘‘ఒకరోజు నా సోదరుడు ఫోన్ చేసి జిల్ గురించి చెప్పాడు. ఆమె చక్కగా ఉంటుంది. కానీ రాజకీయాలను ఇష్టపడదు’’ అని అన్నాడు.
‘ప్రేమలేఖ’తో విరాళాలు సేకరించిన ట్రంప్
ఈ మాట తర్వాత జిల్ అందుకున్నారు. ఆ రోజుల్లో అనుకోనివిధంగా వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పారు. ఆ ఫోన్ చేసింది జో బైడెనే. ‘‘ఆయన ఒక శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి, జో బైడెన్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు. నా నంబర్ మీకు ఎలా వచ్చిందంటూ వెంటనే నేను ప్రశ్నించాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే.. ఈ రోజు సాయంత్రం మనం బయటకు వెళ్దామా..? అన్నారు. ‘నేను మరొకరితో డేట్లో ఉన్నాను కుదరదు’ అని చెప్పేశాను. అయినా సరే.. మీరు దానిని బ్రేక్ చేస్తారా..? అంటూ జో అడిగారు’’ అని జిల్ గుర్తు చేసుకున్నారు. ఆమె ఫైనల్గా ‘ఎస్’ చెప్పేలోపు.. తనను పెళ్లి చేసుకోమని బైడెన్(Joe Biden) ఐదుసార్లు అడిగారట.
అప్పటికే జో బైడెన్ వైవాహిక జీవితంలో దెబ్బతిని ఉన్నారు. ఆయన భార్య, కుమార్తె 1972లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఒంటరిగా ఉంటూ ఇద్దరు కుమారులు బ్యూ, హంటర్ సంరక్షణను చూస్తున్నారు. అప్పుడే జిల్తో పరిచయం ఏర్పడింది. 1977లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని తాము తీసుకునే నిర్ణయం ఎంత కీలకమో గుర్తించామని ఆమె అన్నారు. ‘మేం ఇద్దరం పెళ్లి చేసుకుంటే అది ఎప్పటికీ కొనసాగాలి. ఎందుకంటే ఆ చిన్నారులు అప్పటికే కారు ప్రమాదంలో తమ తల్లిని, చెల్లిని పోగొట్టుకున్నారు. అందుకే వారికి మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని అనుకున్నాను’ అంటూ ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆ రోజు అనుకున్నట్లుగానే నేటివరకు ఆయన ఎదుగుదలలో ఆమె వెన్నంటే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం