Justin Trudeau: ‘మేం చేసింది ఘోర తప్పిదం.. క్షమించండి’: కెనడా ప్రధాని ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau)ను ‘నాజీ వివాదం’ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇది పార్లమెంట్లో జరిగిన ఘోర తప్పిదమంటూ క్షమాపణలు చెప్పారు.
టొరంటో: ఓ వైపు ‘ఖలిస్థానీ’ అంశంలో భారత్తో వివాదం జరుగుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau)ను ‘నాజీ’ అంశం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అది ఇప్పటికే తన ప్రభుత్వంలో స్పీకర్ రాజీనామాకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ట్రూడో(Justin Trudeau).. బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అలాగే ఉక్రెయిన్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు ఇప్పటికే దౌత్యమార్గాల్లో చర్చలు జరిపారు.
రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelenskyy) ఇటీవల కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గత శుక్రవారం పార్లమెంట్కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ఆంటోనీ రోటా ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్లో జెలెన్స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్ రోటా స్వయంగా అతడిని పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడిగా కీర్తించారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు.
పార్లమెంట్ గౌరవించిన హంకా రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పక్షాన పోరాడిన ‘14వ వాఫన్ గ్రనేడియర్ డివిజన్’కు చెందిన వ్యక్తి అని ఆ తర్వాత తేలింది. దాంతో ఈ ఘటనపై ట్రూడో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దాంతో మంగళవారం స్పీకర్ రోటా పదవికి రాజీనామా చేశారు. అయినా ఈ వివాదం చల్లారకపోవడంతో ట్రూడో(Justin Trudeau) తాజాగా బహిరంగ క్షమాపణలు చెప్పారు.
‘శుక్రవారం జరిగిన ఘటనకు ఈ సభ తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయంలో ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelenskyy), ఆ దేశ ప్రతినిధి బృందాన్ని దౌత్యమార్గాల ద్వారా సంప్రదించాం. ఆ రోజున పార్లమెంట్కు వచ్చిన వ్యక్తిని గుర్తించడంలో ఘోర తప్పిదం జరిగింది. నాజీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన వారి చేదు జ్ఞాపకాలను విస్మరించినట్లయింది’ అని ట్రూడో విచారం వ్యక్తం చేశారు.
కెనడా పార్లమెంట్లో నాజీ సైనికుడికి జరిగిన సత్కారాన్ని రష్యా తీవ్రంగా నిరసించింది. ‘ఉక్రెయిన్ లక్ష్యాన్ని తప్పుదారి పట్టించేందుకు రష్యా ఈ తప్పిదాన్ని రాజకీయం చేస్తోంది. ఇది నాకు ఇబ్బందిగా ఉంది’ అని ట్రూడో(Canadian Prime Minister Justin Trudeau) ఇప్పటికే ఓ సారి విలేకర్ల వద్ద వాపోయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
ఓ పక్క హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ పొడిగించిన వేళ జెరూసలెంలో ఉగ్రదాడి చోటు చేసుకొంది. బస్టాప్లో ఉన్న ప్రజలపై ఇద్దరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. -
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
Israel-Hamas: ఒకవైపు బందీల విడుదల కొనసాగుతుండగా.. తమ చెరలో ఉన్న ఓ చిన్నారి మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. -
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర వెనుక భారతీయ వ్యక్తిపై తాజాగా అమెరికా(USA) అభియోగాలు మోపింది. -
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
Henry Kissinger: ప్రముఖ దౌత్య వేత్త అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత కూడా. -
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. -
ఇక హెచ్-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. -
పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం
సంప్రదాయ ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. -
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కాప్ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్
గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. -
అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వెంటనే అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కోరారు. -
ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ
క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. -
ఎన్నికల ముందు షరీఫ్కు ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (73)ను ఏవెన్ఫీల్డ్ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. -
నేపాల్లో తొలి స్వలింగ వివాహ నమోదు
నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్జంగ్ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. -
81కి చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం
ఉక్రెయిన్ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్ భార్య మరియా బుడనోవ్పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ
-
Nimmagdda Ramesh: ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు.. ఏపీ ప్రజలకు నిమ్మగడ్డ కీలక సూచన