Jacinda Ardern: న్యూజిలాండ్ ప్రధాని అనూహ్య ప్రకటన.. రాజీనామా చేసిన జెసిండా
రాజీనామా ప్రకటించి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్(Jacinda Ardern) ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారు. తన ప్రకటన వెనక ఎలాంటి రహస్యం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్(New Zealand) ప్రధాని జెసిండా ఆర్డెర్న్(Jacinda Ardern) అనూహ్య ప్రకటన చేశారు. రాజీనామా ప్రకటించి షాక్ ఇచ్చారు. ప్రగతిశీల పాలనకు పేరుపొందిన ఆమె.. ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. కరోనా కల్లోలం, అత్యంత దారుణస్థాయిలో జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె పాటించిన సంయమనం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇలాంటి ఆమె..తన రాజీనామాకు ఇదే తగిన సమయమని వెల్లడించారు.
‘నేనొక మనిషిని. మనం చేయగలినంత కాలం చేస్తాం. తర్వాత సమయం వస్తుంది. ఇప్పుడు నా సమయం. ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత ఉన్నతమైంది. అయితే, అది అత్యంత సవాలుతో కూడుకున్న పని. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తిస్థాయిలో లేనప్పుడు కొనసాగలేం. మీరు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తా..? కాదా..? అనేది తెలుసుకోవడం కూడా ఒక బాధ్యతే. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవలేమని భావించడం వల్ల నేను ఈ పదవిని వీడటం లేదు. ఎందుకంటే మనం విజయం సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’ అంటూ లేబర్ పార్టీ సభ్యులతో మాట్లాడారు. తన రాజీనామా వెనక ఎలాంటి రహస్యం లేదని వ్యాఖ్యానించారు.
2017లో ఆమె మొదటిసారి న్యూజిలాండ్ ప్రధానిగా నియమితులయ్యారు. సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఇక 2020లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని విజయతీరాలకు నడిపించారు. తాజాగా రాజీనామా ప్రకటించిన ఆమె.. ఫిబ్రవరి ఏడు వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 14న జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు. మరోపక్క ఈ సమయం వరకు కొత్త ప్రధానిని జనవరి 22న ఎన్నుకోనున్నారు.
ప్రస్తుతం ఆమె ప్రభుత్వం ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ పడిపోయినట్లు వెల్లడైంది. ఇదిలా ఉంటే.. 2019లో క్రైస్ట్చర్చ్ నగరంలోని మసీదుపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె వ్యహరించిన తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఆ ఘటనలో 51 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడ్డారు. ఆ హింసాకాండకు ఆమె ఎంతగానో చలించిపోయారు. అలాగే ప్రకృతి విపత్తు, కరోనా కల్లోలాన్ని ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ హతమయ్యాడు. -
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?