Covid Vs Kim: కిమ్ సామ్రాజ్యంలో కరోనా ఉగ్రరూపం..?
కిమ్ సామ్రాజ్యానికి ఇతర దేశాల సహకారం లేకుంటే భారీ స్థాయిలో వైరస్ సంక్రమణ, మరణాల ముప్పు తప్పదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఉత్తర కొరియా
సియోల్: కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోయినప్పటికీ గత రెండున్నరేళ్లుగా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటూ ఉత్తర కొరియా చెబుతూ వచ్చింది. వ్యాక్సిన్ సహాయం చేస్తామని పలు దేశాలు ముందుకొచ్చినప్పటికీ తమకు అవసరం లేదంటూ దూరం పెట్టింది. అయితే, తాజాగా తమ దేశంలో వైరస్ వెలుగు చూసిందని ప్రకటించిన మరుసటి రోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, కరోనా కేసులపై స్పష్టత ఇవ్వనప్పటికీ దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నారని తెలిపింది. వ్యాక్సిన్ల లేమి, పరీక్షల సామర్థ్యం అతితక్కువగా ఉండడం, భయంకరమైన ఆరోగ్య వ్యవస్థ, పేదరికం వంటి సమస్యలు ఎదుర్కొంటోన్న ఉత్తర కొరియాలో వైరస్ ఉద్ధృతి కొనసాగితే పరిస్థితి ఏంటనే విషయంపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో కిమ్ సామ్రాజ్యానికి ఇతర దేశాల సహకారం లేకుంటే భారీ స్థాయిలో వైరస్ సంక్రమణ, మరణాల ముప్పు తప్పదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చైనా నుంచే ప్రవేశం..?
ప్యాంగ్యాంగ్లోని కొందరిలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసినట్లు ఉత్తర కొరియా ఇటీవల ప్రకటించింది. అయితే, ఎంతమందిలో వైరస్ నిర్ధారణ అయిన విషయాన్ని చెప్పనప్పటికీ మూడున్నర లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నారని మాత్రమే పేర్కొంది. వీరిలో లక్షా 87 వేల మందిని క్వారంటైన్లో ఉంచామని.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మరణించిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించామని వెల్లడించింది. అయితే, దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను తీవ్రంగా పరిగణించిన ఉత్తర కొరియా, దేశవ్యాప్తంగా ‘అత్యంత అత్యవసర పరిస్థితి’ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సరిహద్దు ప్రాంతమైన చైనా నుంచే ఒమిక్రాన్ వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు ఉత్తర కొరియాలో కేవలం 64,200 కొవిడ్ పరీక్షలు మాత్రమే నిర్వహించారు.
మిలటరీ పరేడ్తో మొదలు
రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ దరిచేరలేదని చెబుతోన్న ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి మొదలైనట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇన్ని నెలలపాటు సరిహద్దులు మూసివేసిన ఉ.కొరియాలో ఈ స్థాయిలో వైరస్ విజృంభణ ఎలా మొదలైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఏప్రిల్ 25వ తేదీన మిలటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో పరేడ్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పటికీ మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలేవీ కనిపించలేదు. అప్పటినుంచే వేల మందిలో కొవిడ్ లక్షణాలు బయటపడ్డాయని.. దేశంలో కొవిడ్ విజృంభణకు మిలటరీ పరేడ్తో సంబంధం ఉండవచ్చని దక్షిణ కొరియా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే, అంతకుముందు కూడా పరేడ్లు జరిగినప్పటికీ మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తుచేశారు.
టీకా మాటే ఎరుగని ఉత్తరకొరియా
ఇప్పటికే లక్షల మంది కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు వార్తలు రావడం చూస్తుంటే ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘దేశంలో మెజారిటి ప్రజలకు కరోనాను నిరోధించే రోగనిరోధకత లేదు. కనీసం ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవు. కొవిడ్ చికిత్సకు అవసరమైన ఔషధాలు కూడా లేవు’ అని దక్షిణ కొరియాకు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో భారీ స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ జరిగినప్పటికీ అక్కడ ఇంకా కొవిడ్ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అలాంటిది కనీస వైద్య సదుపాయాలు లేని ఉత్తర కొరియాలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాక్డౌన్ ఒక్కటే శరణ్యమా..?
కొవిడ్ కట్టడిని అదుపు చేయాలంటే ఉత్తర కొరియా చేతిలో అస్త్రాలు తక్కువేనని చెప్పవచ్చు. అందుకే మొదటి కేసు నమోదైన తొలిరోజే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. కొవిడ్ పరీక్షలు సంగతి పక్కనబెడితే లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్లో ఉండాలని చెబుతోంది. పని ప్రదేశాల్లోనూ దూరంగా ఉండాలని సూచిస్తోంది. అయితే, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు లేనందున చిట్టచివరగా వైరస్తో కలిసి జీవించే మార్గాన్ని ఉత్తర కొరియా అనుసరించవచ్చనే అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
టీకా కోసం ప్రయత్నిస్తుందా..?
ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు డబ్ల్యూహెచ్ఓతో పాటు ఇతర దేశాలు కృషి చేశాయి. ఇందులో భాగంగా ఉత్తర కొరియాకు వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించినప్పటికీ కిమ్ మాత్రం ముందుకు రాలేదు. తాజాగా కరోనా వైరస్ విజృంభణ మొదలైన నేపథ్యంలోనూ వ్యాక్సిన్ల కోసం ఇతర దేశాల సహాయాన్ని కిమ్ కోరకపోవచ్చని దక్షిణ కొరియా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆయా దేశాలే వ్యాక్సిన్ అందించేందుకు ముందుకు వస్తే మాత్రం వాటిని స్వీకరించే అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. కరోనాతో ప్రాణనష్టం ఉన్నప్పటికీ వ్యాక్సిన్ల కంటే వైరస్ సోకడం ద్వారానే రోగనిరోధక శక్తిని పొందే మార్గాన్నే కిమ్ అనుసరించవచ్చని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!