Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ముఖాన్ని బ్లర్ చేసి, ప్రసారం.. మీడియా ఛానెల్పై తీవ్ర విమర్శలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan) తన దేశంలో తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. వాటిలో భాగంగా తాజాగా ఓ మీడియా ఛానెల్ ఆయన ముఖాన్ని బ్లర్ చేసి ప్రసారం చేసింది.
ఇస్లామాబాద్: పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్(Imran Khan) దృశ్యాలను బ్లర్ చేసి, ప్రసారం చేయడంతో పాకిస్థాన్(Pakistan) మీడియా సంస్థ ఒకటి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఐఎంఎఫ్ ప్రతినిధులతో జరిగిన సమావేశం ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా ఇమ్రాన్ ముఖాన్ని కనిపించకుండా చేసింది. అదే కార్యక్రమంలో ఉన్న ఐఎంఎఫ్ ప్రతినిధి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ మాత్రం టీవీ ప్రసారంలో స్పష్టంగా కనిపించారు.
దాంతో Channel ARYపై పీటీఐ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటు చర్య అని మండిపడ్డారు. అలాగే సదరు ఛానెల్ను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ‘Channel ARY.. ఇమ్రాన్ వల్లే పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఆయనపైనే దాడి చేస్తోంది. వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఆ ఛానెల్ను బాయ్కాట్ చేయండి’ అని పీటీఐ కార్యకర్త ఒకరు ట్విటర్లో విమర్శలు చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్, ఛానల్లో ప్రసారం చేసిన బ్లర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాక్ ప్రభుత్వంపై, మీడియా సంస్థపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు.
- ఇవీ చదవండి: అబద్దాలు చెప్పడంలో వీరే నంబర్ వన్ అట..!
పాకిస్థాన్ ప్రభుత్వం ఇమ్రాన్ఖాన్, ఆయన పార్టీపై కఠినచర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వాటిలో భాగంగా అన్ని ప్రధాన మీడియా సంస్థల ప్రసారాల్లో ఇమ్రాన్ కనిపించకుండా, ఆయన పేరును ప్రచురించకుండా నిషేధం విధించింది. మే 9న ఇమ్రాన్ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆగ్రహించిన పాక్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ అక్కడి మీడియా సంస్థలకు.. ఇమ్రాన్ పేరు ప్రస్తావించకూడదని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆదేశాలనే సదరు మీడియా సంస్థ పాటించినట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ (Pakistan)కు ఇటీవల భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్తో కీలక ఒప్పందం జరిగింది. దీనికి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. దీనిని బోర్డు త్వరలో పరిశీలించవచ్చని ఐఎంఎఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
డాలస్ నుంచి టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తి జాక్పాట్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ. 10 వేల కోట్లకు పైగా గెలుచుకున్నాడు. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
Pakistan: పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరి ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే..? -
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో19 మంది మృతి చెందారు. -
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసుపై వచ్చిన మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు అమెరికా విదేశాంగశాఖ అధికారి నిరాకరించారు. ఈ అంశంతో తాము న్యూదిల్లీతో టచ్లోనే ఉన్నామన్నారు. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
ఉక్రెయిన్ తీరప్రాంత నగరమైన ఒడెస్సాలోని హ్యారిపోటర్ కోట(Harry Potter Castle)గా పేరున్న భవనాన్ని రష్యా క్షిపణి ధ్వంసం చేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
Columbia University: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా విద్యార్థులు చేస్తున్న నిరసనలను పోలీసులు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు. తాజాగా కొలంబియా వర్సిటీలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్