Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
లక్షల మంది అఫ్గానీయులు (Afghans) తక్షణమే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని పాకిస్థాన్ (Pakistan) ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ (Afghanistan) నుంచి శరణు కోరి వచ్చే వారిపై పాకిస్థాన్ (Pakistan) కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా వచ్చిన వారు తక్షణమే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేదంటే తరిమివేస్తామని హెచ్చరించింది. ఇలా అఫ్గాన్ నుంచి శరణార్థులుగా (Refugees) వచ్చిన వారు దాదాపు 17లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. వీరందర్నీ దేశం నుంచి పంపించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అఫ్గాన్ను 2021లో తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత అనేక మంది పాకిస్థాన్కు శరణార్థులుగా వచ్చారు. ఐరాస నివేదిక ప్రకారం.. దాదాపు 13లక్షల మంది అఫ్గాన్ పౌరులు శరణార్థులుగా రిజిస్టర్ చేసుకున్నారు. మరో 8.8లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. మరో 17లక్షల మంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్ బుగిటి ఇటీవల పేర్కొన్నారు. అక్రమంగా వచ్చినవారంతా నవంబర్ 1నాటికి తమ దేశం విడిచి పోవాలని ఆదేశించారు. లేదంటే భద్రతా బలగాల సహాయంతో వారిని గుర్తించి.. బలవంతంగా బహిష్కరిస్తామన్నారు. నవంబర్ తర్వాత పాస్పోర్టు లేదా వీసా లేకుండా దేశంలోకి ఎవరినీ అనుమతించమన్నారు. పాకిస్థాన్ పౌరులు కాకున్నా.. ఐడీ కార్డులున్న వారి జాతీయతను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టింగ్నూ ఉపయోగిస్తామని పాక్ మంత్రి సర్ఫరాజ్ స్పష్టం చేశారు.
సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్మెరైనర్ల మృతి..!
తమ దేశంలో ఉన్న అఫ్గాన్ వాసులందర్నీ బయటకు పంపించాలని పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడ్డాయి. అధికారికంగా అనుమతి పొందిన వారిని కూడా పంపించే ప్రయత్నం చేస్తోందని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఇప్పటికే వందల మందిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పాక్లోని అఫ్గాన్ రాయబార కార్యాలయం కూడా పేర్కొంది.
మరోవైపు, బలూచిస్థాన్ ప్రావిన్సులో పాకిస్థానీ తాలిబాన్ (టీటీపీ), ఇస్లామిక్ స్టేట్ గ్రూపు మధ్య తరచూ దాడులు జరుగుతూనే ఉంటాయి. కొంతకాలంగా ఈ మిలిటెంట్ దాడులతో అక్కడి సరిహద్దులు మారుమోగుతున్నాయి. పాక్ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 24 ఆత్మాహుతి దాడులు జరగగా..అందులో 14 దాడుల్లో అఫ్గాన్ పౌరులే ఉన్నారట. ఈ క్రమంలో అఫ్గాన్కు చెందిన ఉగ్ర సంస్థలే తమ ప్రదేశంలోకి చొరబడి దాడులు చేస్తున్నాయంటూ పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అటు తాలిబాన్ నేతృత్వంలోని అఫ్గాన్ మాత్రం వాటిని తిప్పికొడుతోంది. పాక్ సరిహద్దులోని మాస్తాంగ్ నగరంలోని ఓ మసీదులో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్
-
ఆడపిల్లని చేరదీసి.. అంగడిబొమ్మగా చేసి
-
వచ్చినప్పుడు ఒక మాట వెళ్లాక టాటా.. జగన్ మాటలు నీటి మూటలు
-
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
-
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం