Ukraine Crisis: 18,600 మంది రష్యా సైనికులు మృతి.. ఉక్రెయిన్ జెండాను ముద్దాడిన పోప్!
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నెలన్నరకు పైగా కొనసాగుతూనే ఉంది. రష్యా- ఉక్రెయిన్ భీకర పోరులో ఇరువైపులా.....
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నెలన్నరకు పైగా కొనసాగుతూనే ఉంది. రష్యా- ఉక్రెయిన్ భీకర పోరులో ఇరువైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు కోటి మంది జనం తమ ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పొరుగు దేశాలకు పారిపోతున్న దయనీయ పరిస్థితులు ఉక్రెయిన్లో నెలకొన్నాయి. రష్యా సేనల అరాచకత్వానికి అనేకమంది మహిళలు, బాలికలు బతుకులు ఛిద్రంగా మారుతున్నాయి. బుచా నగరంలో పుతిన్ సేనల మారణహోమాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ విషాద ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతిస్తున్నట్టు భారత్ తెలపగా.. దీనిపై విచారణ జరపాలని చైనా కోరింది.
- రష్యా దళాల దాడుల్ని ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటివరకు 18,600 మందికి పైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించుకుంది. అలాగే, 150 విమానాలు, 135 హెలికాప్టర్లు, 684 యుద్ధ ట్యాంకులు, 1861 సాయుధ శకటాలతో పాటు భారీ సంఖ్యలో యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసి రష్యాను ఘోరంగా దెబ్బతీసినట్టు పేర్కొన్నాయి.
- ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దండయాత్ర మొదలైనప్పట్నుంచి ఇప్పటిదాకా దాదాపు కోటి మందికి పైగా పౌరులు భయంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. ఇప్పటివరకు 10 మిలియన్ల మంది తమ ఇళ్లు విడిచి ఉక్రెయిన్లోని ఇతర నగరాలకు, పొరుగు దేశాలకు వలస వెళ్లి ఆశ్రయం పొందినట్టు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
- పుతిన్ సేనలు బుచా పట్టణంలో దాదాపు 320 మంది పౌరుల్ని చంపినట్టు ఆ ప్రాంత మేయర్ అనటోలై ఫెడ్రుక్ తెలిపారు. బుచాలోని పౌరుల్ని రష్యా సైనికులు చంపడం తాను కళ్లారా చూసినట్టు ఏప్రిల్ 5న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
- ఉక్రెయిన్లోని బుచా నగరంలో రష్యా సేనల దాడుల్లో ధ్వంసమైన ఉక్రెయిన్ జెండాను పోప్ ఫ్రాన్సిస్ ముద్దాడారు. వాటికెన్ సిటీలో ఆయన వద్దకు వచ్చిన ఆరుగురు ఉక్రెయిన్ చిన్నారులను ఆయన ఆహ్వానించారు. వారు తీసుకొచ్చిన జాతీయ పతాకాన్ని ముద్దాడుతూ యుద్ధాన్ని ముగించాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆ చిన్నారులకు ఓ పెద్ద చాక్లెట్ ఈస్టర్ గుడ్డు ఇచ్చారు. ఉక్రెయిన్ పౌరులందరి కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
- ఉక్రెయిన్లోని బుచా పట్టణంలో జరిగిన మారణ హోమాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పార్లమెంట్లో ప్రకటన చేశారు. రక్తం చిందించడం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం దొరకదన్నారు. అలాగే ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియ పైనా మాట్లాడారు. భారత్ ఒక వైపు నిలవాల్సి వస్తే.. అది కచ్చితంగా శాంతి పక్షమేనని స్పష్టంచేశారు. అలాగే తక్షణం హింస ముగింపు కోసమే చూస్తోందన్నారు. ఇదే మన దేశ విధానం.. దీన్ని పలు అంతర్జాతీయ వేదికలపైనా స్పష్టంచేశామని తెలిపారు.
- రష్యా సేనల దాడులతో ఉక్రెయిన్లోని బుచా పట్టణంలో మారణహోమంపై వస్తున్న వార్తలు, చిత్రాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని చైనా పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. మానవతా సంక్షోభాన్ని నివారించేందుకు అనుకూలమైన అన్ని చర్యలకు చైనా మద్దతుగా నిలుస్తుందనీ.. పౌరులకు హాని చేసే ఎలాంటి చర్యలనైనా నిరోధించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
- తమ దేశంపై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాపై యూరోపియన్ యూనియన్ ఐదో దశ ఆంక్షల ప్యాకేజీపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ప్రశంసలు కురిపించారు. రష్యా బొగ్గు, ఈయూ పోర్టుల్లోకి నౌకలు, రోడ్డు రవాణా ఆపరేషన్లపై నిషేధం పెట్టడం మంచి పరిణామమన్నారు. పుతిన్ను నిలువరించేందుకు గ్యాస్/చమురుపై ఆంక్షలతో పాటు రష్యాకు చెందిన బ్యాంకులన్నింటినీ స్విఫ్ట్ నుంచి తొలగించాలన్నారు. కఠిన సమయాల్లో తీవ్ర నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు.
- ఆకలినే ఆయుధంగా మలచుకొని రష్యా ఉద్దేశపూర్వకంగానే ఆహార సంక్షోభాన్ని రెచ్చగొడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా దండయాత్ర మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకు కనీసం 167 మంది చిన్నారులు మృతిచెందినట్టు వెల్లడించారు. రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షల్లో అనిశ్చితిని తాము సహించబోమని వ్యాఖ్యానించారు.
- ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలోని వుహ్లేదర్ పట్టణంలో మానవతా సహాయం పంపిణీ కేంద్రంపై రష్యా బలగాలు జరిపిన కాల్పుల్లో కనీసం ఇద్దరు పౌరులు మృతిచెందినట్టు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్టు వెల్లడించారు.
- ఉక్రెయిన్లోని రుబిజెహ్నె పట్టణాన్ని 60శాతం రష్యా బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయని లుహాన్స్క్ గవర్నర్ వెల్లడించారు. మరోవైపు, రష్యాకు చెందిన 12 మంది దౌత్య సిబ్బందిని గ్రీస్ బహిష్కరించినట్టు గ్రీక్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!