Ukraine: మేరియుపొల్లో మారణహోమం..? సామూహిక సమాధులు వెలుగులోకి..!
రష్యా సేనల ఆధీనంలో ఉన్న మేరియుపొల్లో వేల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులను హతమార్చి.. ఆ నేరాలను దాచిపెట్టేందుకు మృతదేహాలను పాతిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వేల సంఖ్యలో మరణాలు ఉండవచ్చన్న ఉక్రెయిన్ అధికారులు
కీవ్: ఉక్రెయిన్లో భీకర దాడులకు తెగబడుతోన్న రష్యా సేనలు పలు నగరాల్లో సామాన్య పౌరులపై దుశ్చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుచాలో వెలుగు చూసిన దారుణ ఘటన మరువక ముందే మేరియుపొల్లోనూ అటువంటి ఆకృత్యాలే జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రష్యా సేనల అధీనంలో ఉన్న మేరియుపొల్లో వేల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులను హతమార్చి.. ఆ నేరాలను దాచిపెట్టేందుకు మృతదేహాలను పాతిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేరియుపొల్ సమీపంలో తాజాగా వెలుగు చూసిన సామూహిక సమాధులు ఉక్రెయిన్ అధికారుల ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు వెలుగు చూడడంతో ఇటీవల బుచాలో బయటపడిన దానికంటే దారుణాలు మేరియుపొల్లో చోటుచేసుకున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
యుద్ధ నేరాలను దాచడానికే..!
ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో వేల మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయనే వార్తలు వెలుబడ్డాయి. తాజాగా మేరియుపొల్కు సమీపంలోని మన్హుష్ పట్టణంలో 200లకు పైగా సమాధులు తవ్విన విషయం మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో వెలుగు చూసింది. మేరియుపొల్లో ప్రతిఘటించిన పౌరులను హతమార్చి సమీప పట్టణంలో తవ్విన ఈ సమాధుల్లో పూడ్చివేస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. కేవలం యుద్ధ నేరాలను కప్పిపుచ్చుకోవడానికే రష్యా సైన్యం ఈ దాష్టీకాలకు పాల్పడుతోందని మేరియుపొల్ మేయర్ వాదిం బోయ్కెన్కో ఆరోపించారు. ఇప్పటివరకు 9వేల మందిని పూడ్చగలిగే సమాధులను గుర్తించినట్లు మేరియుపొల్ సిటీ కౌన్సిల్ అంచనా వేసింది.
20వేల మంది మృతి..?
4లక్షలకు పైగా జనాభా కలిగిన మేరియుపొల్లో ప్రస్తుతం లక్ష మంది చిక్కుపోయినట్లు సమాచారం. క్షిపణి దాడులతో నాశనమవుతోన్న నగరంలో ఆహారం, నీరు, ఔషధాల లేమితో వారందరూ తీవ్రంగా సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధికారుల లెక్కల ప్రకారం, రష్యా సేనల ఆధీనంలో ఉన్న మేరియుపొల్లోనే 20వేలకుపైగా పౌరులు మరణించి ఉండవచ్చని అంచనా. అయితే, ఆ నగర సమీపంలోని గ్రామాల్లో హత్యాకాండకు పాల్పడుతూ మృతదేహాలను సామూహిక ఖననాలు చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. తాజాగా మేరియుపొల్ సమీపంలోని మన్హుష్ పట్టణంలో వెలుగు చూసిన వందల సంఖ్యలో సమాధులు మార్చి నెలలోనే తవ్వినప్పటికీ ఈ మధ్యే వాటి సంఖ్య పెరిగినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందన్నారు.
ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ నుంచి మేరియుపొల్కు విముక్తి కలిగించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రకటించారు. ఇదే సమయంలో అక్కడి అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్లో ఉన్న సొరంగాల్లో 2వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు అంచనా. అయినప్పటికీ ఆ ప్రాంతం మొత్తం ముట్టడించి ఏ ఒక్కరినీ అందులోకి వెళ్లనీయొద్దని రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షోయిగును అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. కనీసం మూడు, నాలుగు రోజుల తర్వాతైనా సొరంగంలో వారు ఆహారం, నీటి కోసం బయటకు వస్తారని.. అలా వచ్చేవారిని అదుపులోకి తీసుకోవాలని రష్యా సేనలు వ్యూహరచన చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి. -
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్సు మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. -
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే (Hush money) ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో శృంగార తార స్టార్మీ డేనియల్ వాంగ్మూలం ఇచ్చారు. -
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
బ్రిటన్లో ఓ లెక్కల టీచర్ వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.విద్యార్థులతో ఆమె సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. -
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక
India-Canada: కెనడా గడ్డ నుంచి సిక్కు వేర్పాటువాద గ్రూప్లు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ దేశంలో భారత రాయబారి అన్నారు. -
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
యూకే విమానాశ్రయాల్లో మంగళవారం అత్యంత తీవ్రమైన సమస్య కొన్ని గంటలపాటు ప్రయాణికులకు నరకం చూపించింది. -
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
రఫాపైకి దూకుడుగా వెళుతున్న ఇజ్రాయెల్కు అమెరికా గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన బాంబుల సరఫరాను ఆపేసింది. -
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
AstraZeneca: గిరాకీ తగ్గిన నేపథ్యంలో తమ కొవిడ్ వ్యాక్సిన్ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. -
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!