Nepal PM: ‘నన్ను పీఎం చేసేందుకు గతంలో భారత వ్యాపారి ప్రయత్నం’.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఓ భారత వ్యాపారి గురించి నేపాల్ ప్రధాని (Nepal PM) చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో వేడిని రాజేశాయి. దీంతో ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
కాఠ్మాండూ: నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కుమార్ దహల్ ప్రచండ వివాదంలో చిక్కుకున్నారు. తనను ప్రధానిని చేసేందుకు నేపాల్లో స్థిరపడిన ఓ భారత వ్యాపారి గతంలో సాయం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హిమాలయ దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రచండ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
కాఠ్మాండూలో స్థిరపడిన ప్రముఖ భారత వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్ జీవితకథపై రచించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ప్రచండ మాట్లాడుతూ.. ‘‘నేపాల్-భారత్ బంధాన్ని బలోపేతం చేయడంలో సర్దార్ ప్రీతమ్ సింగ్ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ఓసారి నన్ను ప్రధానిగా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనేకసార్లు దిల్లీ వెళ్లారు. కాఠ్మాండూలోని రాజకీయ నేతలతో పలు మార్లు చర్చలు జరిపారు’’ అని వ్యాఖ్యానించారు.
- ఇదీ చదవండి: నెగెటివ్లోకి సునాక్ ఆమోద రేటింగ్..
ఈ వ్యాఖ్యలు కాస్తా నేపాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని ప్రచండ రాజీనామా చేయాలని పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) ఛైర్మన్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలపై ప్రచండ కేవలం వివరణ ఇస్తే సరిపోదని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని అన్నారు. ‘‘ఆయన వ్యాఖ్యలు దేశ స్వతంత్రత, మర్యాదకు భంగం కలిగించాయి. రాజ్యాంగం, దేశ పార్లమెంట్ను అవమానించేలా ఉన్నాయి’’ అని ఓలీ దుయ్యబట్టారు. విపక్షాలే కాదు.. సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నేతలు కూడా ప్రచండ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాగా.. ఈ వివాదంపై ప్రధాని ప్రచండ స్పందించారు. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి వివాదం రేపుతున్నారని ఆరోపించారు. పుస్తకంలో ప్రీతమ్ సింగ్ చెప్పిన వ్యాఖ్యలనే తాను చెప్పానని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.