Putin: ‘నాటోలో ఆ రెండు దేశాల చేరికపై మాకేం సమస్య లేదు. కానీ..’ పుతిన్ కీలక వ్యాఖ్యలు
ఫిన్లాండ్, స్వీడన్లు నాటోలో చేరితే రష్యాకు ఎటువంటి ఇబ్బంది లేదని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ మాదిరి ఆ రెండు దేశాలతో తమకెలాంటి ప్రాదేశిక విభేదాలు లేవని తెలిపారు...
ఇంటర్నెట్ డెస్క్: ఫిన్లాండ్, స్వీడన్లు నాటోలో చేరితే రష్యాకు ఎటువంటి ఇబ్బంది లేదని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ మాదిరి ఆ రెండు దేశాలతో తమకెలాంటి ప్రాదేశిక విభేదాలు లేవని తెలిపారు. తుర్క్మెనిస్థాన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘నాటోలో స్వీడన్, ఫిన్లాండ్ల చేరిక విషయమై మాకు ఎలాంటి సమస్య లేదు. అది వారి ఇష్టం. వారు కోరుకున్నదాంట్లో చేరొచ్చు. అయితే.. మిలిటరీ బృందాలు, సైనిక మౌలిక సదుపాయాలను అక్కడ మోహరించినట్లయితే మాత్రం.. మేం తగు రీతిలో స్పందిస్తాం. ఆ ఏర్పాట్లతో రష్యాకు ఎటువంటి ముప్పు ఉత్పన్నమవుతుందో.. మేం సైతం అదే తరహా వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం మా మధ్య అంతా బాగానే ఉంది. కానీ.. ఇకముందు కొన్ని ఉద్రిక్తతలు ఉండొచ్చు. మాకు ముప్పు ఉంటే అవి అనివార్యం’ అని చెప్పారు.
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య పరిణామాల నేపథ్యంలో.. స్వీడన్, ఫిన్లాండ్లు నాటో కూటమిలో చేరేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగిన నాటో సదస్సులో వాటి సభ్యత్వం కోసం అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు.. ఈ రెండు దేశాల చేరికపై అభ్యంతరం చెబుతూ వచ్చిన తుర్కియే(టర్కీ) సైతం ఎట్టకేలకు తన అంగీకారాన్ని తెలిపింది. రష్యా మొదటినుంచి విమర్శిస్తూ వచ్చింది. ఈ వ్యవహారాన్ని.. అంతర్జాతీయ భద్రతను అస్థిరపరిచే అంశంగా పేర్కొంది. ఈ క్రమంలోనే పుతిన్ తాజాగా మాట్లాడుతూ.. ఉక్రెయిన్ వివాదం ద్వారా నాటో దేశాల నేతలు తమ ఆధిపత్యాన్ని, సామ్రాజ్యవాద ధోరణిని చాటుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వారి లక్ష్యం.. ఉక్రెనియన్ల శ్రేయస్సు కాదని, సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకేనని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి. -
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్సు మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. -
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే (Hush money) ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో శృంగార తార స్టార్మీ డేనియల్ వాంగ్మూలం ఇచ్చారు. -
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
బ్రిటన్లో ఓ లెక్కల టీచర్ వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.విద్యార్థులతో ఆమె సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. -
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక
India-Canada: కెనడా గడ్డ నుంచి సిక్కు వేర్పాటువాద గ్రూప్లు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ దేశంలో భారత రాయబారి అన్నారు. -
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
యూకే విమానాశ్రయాల్లో మంగళవారం అత్యంత తీవ్రమైన సమస్య కొన్ని గంటలపాటు ప్రయాణికులకు నరకం చూపించింది. -
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
రఫాపైకి దూకుడుగా వెళుతున్న ఇజ్రాయెల్కు అమెరికా గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన బాంబుల సరఫరాను ఆపేసింది. -
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
AstraZeneca: గిరాకీ తగ్గిన నేపథ్యంలో తమ కొవిడ్ వ్యాక్సిన్ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. -
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!