Ukraine Crisis: రష్యాకు భారీ సైనిక నష్టం.. 1500 మంది సైనికాధికారులు మృతి..!
ఉక్రెయిన్ యుద్ధంలో భారీ స్థాయిలో సైనిక నష్టం జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేవలం రష్యా వైపే సుమారు లక్ష మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. వీరిలో 1500 మంది ఉన్నతాధికారులు ఉండగా, వారిలో 160 మంది వివిధ స్థాయి సైనిక జనరళ్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న భీకర యుద్ధంలో వేల మంది సైనికులు మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా వైపు భారీస్థాయిలో ప్రాణనష్టం జరుగుతున్నట్లు చెబుతున్నాయి. ఇలా గడిచిన తొమ్మిది నెలల కాలంలో 1500 మందికి పైగా రష్యా సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదిక పేర్కొంది. అందులో 160 మందికిపైగా జనరల్ స్థాయి అధికారులున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన నివేదికలను బట్టి ఈ అంచనాలు వెలువడుతున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టానికి సంబంధించి పాశ్చాత్య దేశాలు వేస్తోన్న అంచనాలను రష్యా అంగీకరించడం లేదు. సెప్టెంబర్ వరకు కేవలం 5397 మంది సైనికులు మాత్రమే చనిపోయినట్లు అధికారికంగా పేర్కొంది. అయితే, యుద్ధంలో ఇప్పటివరకు లక్షకు పైగా రష్యా సైనికులు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని అమెరికా జనరల్ మార్క్ మిల్లే వెల్లడించారు. అటు ఉక్రెయిన్కు కూడా ఇదే సంఖ్యలో సైనికులను కోల్పోయినట్లు అంచనా వేశారు. అంతేకాకుండా మరో 40వేల మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోగా.. 1.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది వలస వెళ్లినట్లు చెప్పారు.
ఈ యుద్ధంలో సుమారు 87వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ సైనిక విభాగం కూడా ఇటీవలే పేర్కొంది. ఇలా సైనిక మరణాలే ఈ స్థాయిలో ఉంటే తీవ్ర గాయాలపాలైన వారి సంఖ్య మూడింతలు ఎక్కువ ఉండవచ్చని అంచనా. ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తొలి రెండు నెలల్లోనే రష్యా వైపు భారీ ప్రాణనష్టం జరిగినట్లు అంచనా. ఇటువంటి సమయంలో ఇరు దేశాలకు సైనిక విజయం సాధ్యం కాదని.. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికేందుకు అవకాశాలు ఉన్నాయని అమెరికా జనరల్ మార్క్ మిల్లే అభిప్రాయపడ్డారు.
మరిన్ని రోజులు ప్రతికూల పరిస్థితులు
రష్యా చేస్తోన్న భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్కు అక్కడ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. పవర్ గ్రిడ్ పూర్తిగా దెబ్బతినడంతో చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. దీంతో తీవ్ర చలి నుంచి రక్షించుకోవడం ఇబ్బందిగా మారింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు మరోవారంపాటు కొనసాగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించినా రష్యా సేనలను తమ సైన్యం దీటుగా తిప్పికొడుతోందని ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?