Karachi Blast: చైనీయుల ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంటాం..
పాకిస్థాన్లోని కరాచీ యూనివర్శిటీలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని డ్రాగన్ తీవ్రంగా ఖండించింది. చైనీయులు చిందించిన ప్రతి రక్తపు బొట్టునూ వృథా కానివ్వమని, ఈ ఘటన వెనుక బాధ్యులు
కరాచీ పేలుడుపై డ్రాగన్ హెచ్చరిక
బీజింగ్: పాకిస్థాన్లోని కరాచీ విశ్వవిద్యాలయంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని డ్రాగన్ తీవ్రంగా ఖండించింది. చైనీయులు చిందించిన ప్రతి రక్తపు బొట్టునూ వృథా కానివ్వమని, ఈ ఘటన వెనుక బాధ్యులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చైనా విదేశాంగ శాఖ హెచ్చరించింది. తమ దేశీయులకు మరింత భద్రత కల్పించాలని ఈ సందర్భంగా పాక్ను డిమాండ్ చేసింది.
కరాచీ యూనివర్సిటీలో స్థానిక విద్యార్థులకు చైనీస్ భాషను బోధించే కన్ఫూసియస్ ఇన్స్టిట్యూట్ వద్ద మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. బుర్ఖా ధరించిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చైనీస్ టీచర్లు, పాక్కు చెందిన వ్యాన్ డ్రైవర్ మృతిచెందారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వు జియాంగావో.. చైనాలోని పాక్ రాయబారికి ఫోన్ చేసి మాట్లాడారు. ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పాక్ను డిమాండ్ చేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి వెల్లడించారు. ఇదే సమయంలో పాకిస్థాన్లో నివసిస్తోన్న చైనీయులకు మరింత భద్రత కల్పించాలని కోరినట్లు తెలిపారు.
ఈ దాడి తమ పనేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఘటన అనంతరం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ‘‘బలూచిస్థాన్ నుంచి పాక్, చైనా వెంటనే వెళ్లిపోవాలి. లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. చైనీయులపై దాడి కోసం ప్రత్యేక యూనిట్నే ఏర్పాటు చేశాం’’ అని తుపాకీ పట్టుకున్న ఓ వ్యక్తి ఆ వీడియోలో హెచ్చరించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇరాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దులుగా ఉన్న బలూచిస్థాన్లో చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ కింద రెండు దేశాలు పలు ప్రాజెక్టులు చేపట్టాయి. అయితే ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోన్న బలూచ్ వేర్పాటు వాదుల బృందం.. గతంలోనే అనేక సార్లు చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. గతేడాది జులైలో కరాచీలో ఇద్దరు చైనీయులపై కాల్పులు జరిపి చంపేశారు. అదే నెలలో ఈశాన్య పాకిస్థాన్లో చైనా ఇంజినీర్లతో వెళ్తోన్న ఓ బస్సుపై దాడి చేయగా.. 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్