Donald Trump: ట్రంప్ మెడకు ‘టాయిలెట్’ వివాదం..!
కీలక పత్రాలను మాయం చేశారని ఆరోపిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కథనాలు వెలుబడడం కలవరం రేపుతోంది.
కీలక పత్రాల మాయం చేశారనే ఆరోపణలతో కథనాలు
వాషింగ్టన్: కీలక పత్రాలను మాయం చేశారని ఆరోపిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కథనాలు వెలువడడం కలవరం రేపుతోంది. ముఖ్యంగా ఆయన పదవిలో ఉన్న సమయంలో అనేక కీలక పత్రాలను చింపివేసి వైట్హౌస్ టాయిలెట్లో పడేసి ఉండొచ్చన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సంబంధించి తాజాగా కథనాలు వెలువడడం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. అటువంటి నివేదికలు తప్పుదోవపట్టించేవేనని స్పష్టం చేశారు. ఆ ఆరోపణలు అవాస్తవమంటూ తోసిపుచ్చుతూ తాజాగా ఓ ప్రకటన చేశారు.
ట్రంప్ అధ్యక్ష పదవిని వీడిన తర్వాత ఆయన పాలనా కాలంలో కార్యకలాపాలకు సంబంధించి పలు ఇంటర్వ్యూలతో న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ మాగీ హాబెర్మ్యాన్ ఓ పుస్తకం రాశారు. ట్రంప్ కార్యాలయంలోని టాయిలెట్లో పలుసార్లు పేపర్ ముక్కలు పేరుకుపోయినట్లు వైట్హౌస్ సిబ్బంది గుర్తించారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ చింపివేసిన పత్రాలు టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చనే అనుమానానికి అవి ఆజ్యం పోశాయని అందులో వెల్లడించారు. త్వరలోనే విడుదల కానున్న ఆ పుస్తకంలోని విషయాలను తొలుత యాక్సియోస్ అనే వెబ్సైట్ ప్రచురించింది.
ట్రంప్కు అలవాటే..
అధ్యక్ష కార్యాలయానికి చెందిన పత్రాలను భద్రపరచడంలో డొనాల్డ్ ట్రంప్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారని గతంలోనూ విమర్శలు ఉన్నాయి. కీలక పత్రాన్ని చదివిన తర్వాత ముక్కలుగా చింపివేసే అలవాటు ఆయనకు ఉందని గతంలో ఓ నివేదిక వెల్లడించింది. 2018లో ఓసారి కీలక పత్రాన్ని చింపివేయగా.. వాటన్నింటిని సేకరించి టేప్తో అతికించి భద్రపరిచేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని ఆ నివేదిక పేర్కొంది. ఆ విషయం నిజమేనంటే నేషనల్ ఆర్కైవ్స్ గతవారం ధ్రువీకరించింది. అయితే, ఇటీవల వస్తున్న ఆరోపణలపై నేషనల్ ఆర్కైవ్స్ దృష్టి సారించింది. ప్రభుత్వ పత్రాల నిర్వహణలో డొనాల్డ్ ట్రంప్ చట్టాలను ఉల్లంఘించినట్లు అనుమానిస్తూ.. అసలు ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో డాక్యుమెంట్ల నిర్వహణ ఏవిధంగా ఉందో పరిశీలించాలని అక్కడి న్యాయ విభాగానికి సూచించినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ కథనం వెల్లడించింది.
కిమ్ ప్రేమలేఖలు..
కీలక పత్రాల విషయంలో ట్రంప్ అనుసరించిన తీరుపై ఇటీవలి కాలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రంప్కు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి కీలక డాక్యుమెంట్లతో కూడిన 15 డబ్బాలతోపాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి నేషనల్ ఆర్కైవ్స్ (NARA) ఇటీవల వెల్లడించింది. రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిన ట్రంప్.. వాషింగ్టన్ నుంచి వెళ్లిపోయే సమయంలో కొన్ని అధికారిక పత్రాలను ఆయన వెంట తీసుకువెళ్లినట్లు ధ్రువీకరించింది. వాటిలో ఉత్తరకొరియా నియంత కిమ్ జోన్ ఉన్తో జరిగిన సంభాషణ పత్రాలతోపాటు అంతకుముందు అధ్యక్షుడిగా చేసిన బరాక్ ఒబామా నూతన అధ్యక్షుడికి రాసిన లేఖ కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే, కిమ్తో జరిపిన సంప్రదింపు లేఖలను ట్రంప్ అప్పట్లో ‘ప్రేమ లేఖలు’గా పేర్కొనేవారు.
అవి అవాస్తవం..
తాజాగా వచ్చిన ‘టాయిలెట్’ ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘మరో ఫేక్ స్టోరీ’ అని చెప్పిన ఆయన.. చాలా వరకు కల్పిత అంశాలతో ఓ విలేకరి రూపొందించిన పుస్తకం ప్రచారం కోసమే ఈ ప్రయత్నం అంటూ ఓ ప్రకటన చేశారు. తానేమీ తప్పు చేయలేదన్న ట్రంప్.. మీడియాలో వస్తున్న కథనాల్లోనూ వాస్తవం లేదన్నారు. NARAతో తన సంబంధాలను సరిగా లేవంటూ మీడియాలో వస్తున్నవి తప్పుడు వార్తలన్నారు. తన హయాంలో అధికారిక పత్రాలను భద్రపరచడంలో నేషనల్ అర్కైవ్స్తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటూ తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా.. గతేడాది జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి పాల్పడిన ఘటనపై ప్రత్యేక కమిటీ దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే తాజా ఆరోపణలు రావడం ట్రంప్కు మరింత తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్యాపిటల్పై దాడి జరగడానికి ముందు, తర్వాత ఏం జరిగిందన్న విషయాలను తెలుసుకోవడంపై ఆ కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ ఘటన సమయంలో అధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక పత్రాల గురించి నేషనల్ ఆర్కైవ్స్ను కమిటీ ఇది వరకే సంప్రదించింది. ఇలాంటి తరుణంలో పలు పత్రాలను ట్రంప్ మాయం చేశారనే ఆరోపణలు రావడం మాజీ అధ్యక్షుడికి మరింత సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ