Ukraine Crisis: ఆయుధాలు ఇవ్వండి.. ప్రాణాలు రక్షించుకుంటాం..!
సైనిక సహాయం చేయనప్పటికీ కనీసం ఆయుధాలనైనా ఇవ్వండంటూ నాటో (NATO) దేశాలను ఉక్రెయిన్ వేడుకుంటోంది.
నాటో దేశాలను వేడుకుంటోన్న ఉక్రెయిన్
బ్రసెల్స్: సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులకు పాల్పడుతున్నప్పటికీ.. ఉక్రెయిన్ మాత్రం ఎదురొడ్డి నిలుస్తోంది. ఆయుధ సామగ్రి, సైనిక బలం తక్కువగానే ఉన్నప్పటికీ నలభై రోజులుగా కొనసాగుతోన్న దురాక్రమణను దీటుగా ఎదుర్కొంటోంది. అయితే, బుచా వంటి మరిన్ని దారుణ ఘటనలను నిరోధించాలంటే తమకు మరిన్ని ఆయుధాలు అందించాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా సైనిక సహాయం చేయనప్పటికీ కనీసం ఆయుధాలనైనా ఇవ్వండంటూ నాటో (NATO) దేశాలను వేడుకుంటోంది.
ఉక్రెయిన్కు మద్దతు నిలిచే విషయంపై చర్చించేందుకు బ్రసెల్స్లో నాటో దేశాల విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమైత్రో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటో దేశాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ‘మాకు ఎలా పోరాడాలో తెలుసు. ఎలా గెలవాలో తెలుసు. కానీ అవసరమైన ఆయుధాలు లేకుంటే విజయం కోసం అపారమైన త్యాగాలు చేయాల్సి వస్తుంది. అందుకే మేము కోరేది ఒక్కటే. ఆయుధాలు.. ఆయుధాలు.. ఆయుధాలు.. కావాలని అడుగుతున్నాం. ఎంత తొందరగా ఆయుధాలు ఉక్రెయిన్ చేరుకుంటే.. అంత ఎక్కువ మంది ప్రాణాలను రక్షించుకున్న వాళ్లమవుతాం’ అని ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమైత్రో కుబేలా పేర్కొన్నారు.
మాకు సమయం లేదు..
ఉక్రెయిన్పై రష్యా సేనలు మొదలుపెట్టిన సైనిక చర్యకుముందు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చేందుకు జర్మనీ నిరాకరించింది. కానీ, రష్యా సేనల దురాక్రమణ మొదలైన వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్న జర్మనీ.. ఉక్రెయిన్కు ఆయుధాలు, రక్షణసామగ్రి పంపించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో జర్మనీ మరెంతో సహాయం చేయగలదన్న ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమైత్రో, సాధ్యమైనంత తొందరగా అవి ఉక్రెయిన్కు చేరవేయాలని అభ్యర్థించారు. ఈ విషయంలో బెర్లిన్కు సమయం ఉండవచ్చేమో గాని కీవ్కు మాత్రం సమయం లేదన్నారు.
వీటిపై స్పందించిన జర్మనీ విదేశాంగమంత్రి అన్నాలెనా బేయర్బోక్.. ఉక్రెయిన్ ఆత్మరక్షణకు మద్దతు ఇచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను భాగస్వామ్య పక్షాలతో కలిసి పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్ అభ్యర్థనపై స్పందించిన నాటో జనరల్ సెక్రటరీ జేన్స్ స్టోల్టెన్బర్గ్.. ‘ఉక్రెయిన్ ఆత్మరక్షణ కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో తేలికపాటి యుద్ధ సామగ్రితోపాటు భారీ ఆయుధాలను కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంది’ అని ఉద్ఘాటించారు.
ఇదిలాఉంటే, సైనిక చర్యతో రష్యా దురాక్రమణకు పాల్పడుతున్నప్పటికీ నాటో దేశాలు మాత్రం వారి సైన్యాన్ని ఉక్రెయిన్కు పంపించేందుకు నిరాకరిస్తున్నాయి. కానీ, ఉక్రెయిన్కు మద్దతుగా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే ఆయుధాలతో పాటు వైద్య పరికరాల సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే, కేవలం ఈ సహాయం సరిపోవడం లేదని.. మరిన్ని ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ అభ్యర్థిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!