USA: ఐరోపాకు అమెరికా వెన్నుపోటు..!
ఐరోపాలోని మిత్రదేశాలను అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన శీతాకాలంలో వాటికి అత్యవసరమైన గ్యాస్ సరఫరా వ్యవస్థను అమెరికా ఓ కోవర్ట్ ఆపరేషన్లో ధ్వంసం చేసినట్లు కథనాలు వస్తున్నాయి.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
శీతాకాలం ఐరోపా ఖండానికి చమురు, గ్యాస్ ప్రాణవాయువుతో సమానం. అలాంటి ప్రాణవాయువును ఐరోపాలోని మిత్రదేశాలకు అందకుండా అమెరికా(USA)నే కుట్రపన్నిందా..? రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి కోవర్టు ఆపరేషన్ నిర్వహించిందా..? ప్రపంచం దృష్టి మళ్లించి అమెరికా నౌకాదళంలోని రహస్య డైవర్లు ఓ గ్యాస్పైపులైన్ను బద్దలు కొట్టారా..? దీనికి జోబైడెన్ (joe biden)నేరుగా ఆదేశాలు జారీ చేశారా..? ఈ ప్రశ్నలకు ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు సిమౌర్ హెర్ష్ సమాధానం ఇచ్చారు. తాజాగా ఐరాపాలో జర్మనీ వంటి దేశాలకు కీలకమైన నార్డ్స్ట్రీమ్ గ్యాస్ పైపులైన్ను అమెరికా ఓ కోవర్ట్ ఆపరేషన్లో పేల్చేసిందని ఆయన ఆన్లైన్ ప్లాట్ఫామ్ సబ్స్టాక్లో పరిశోధనాత్మక కథనం ప్రచురించారు.
హెర్ష్ రిపోర్ట్ అంటే అమెరికా(USA)కు భయం..?
హెర్ష్ సాధారణ జర్నలిస్టు కాదు.. అతడు 1968లో వియత్నాం యుద్ధంలో అమెరికా(USA) సైన్యం దాదాపు 500 మందికిపైగా నిరాయుధులైన ప్రజలను చంపిన ‘మీ లై’ నరమేధాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు.. 2004లో ఇరాక్లో అబు గ్రైబ్ జైల్లో అమెరికా సైన్యం అరాచకాన్ని బయటపెట్టాడు. ఈ రెండు సార్లు ఆ నివేదికలు తప్పు అని అమెరికా బుకాయించింది. కానీ, చివరికి అవి వాస్తవమని తేలాయి. గతంలో వాటర్గేట్ కుంభకోణాన్ని కూడా హెర్ష్ కవర్ చేశాడు. హెర్ష్ పాత్రికేయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ అవార్డు(1970)ను అందుకొన్నాడు. తాజాగా హెర్ష్ నివేదికతో అమెరికా - రష్యా మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
నౌకాదళ విన్యాసాల ముసుగులో బాంబులు అమర్చి..
2021 డిసెంబర్లో రష్యా దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల వద్దకు చేరడం మొదలైంది. దీంతో ఉక్రెయిన్పై దాడి ఖాయమని తేలిపోయింది. ఈ సమయంలో అమెరికా(USA) సీఐఏ, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఖజానా శాఖ అధిపతులతో కొత్తగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్తో అధ్యక్షుడు జోబైడెన్(joe biden) సమావేశమయ్యారు. నార్డ్స్ట్రీమ్ గ్యాస్ పైప్లైన్ నుంచి చౌక గ్యాస్పై జర్మనీ, పశ్చిమ ఐరోపా ఆధారపడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రెమ్లిన్కు అందే గ్యాస్ డబ్బుతో ఉక్రెయిన్పై దాడి చేస్తుందని భయపడ్డారు. దీంతో నార్డ్స్ట్రీమ్ గ్యాస్ పైప్లైన్ను పేల్చివేయాలని నిర్ణయించారు. దీనిని పేల్చివేయడానికి ప్లాన్ సిద్ధం చేయాలని బైడెన్(joe biden) సూచన మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులేవాన్ సైనిక అధికారులను ఆదేశించారు.
ఈ మొత్తం ఆపరేషన్ కోసం అమెరికా(USA) నిఘా సంస్థలు నార్వే సాయం తీసుకొన్నాయి. పైపులైన్ పేల్చివేయడానికి అనువైన ప్రాంతాలను నార్వే నౌకాదళం గుర్తించి అమెరికాకు తెలియజేసింది. అమెరికా నౌకాదళానికి ఫ్లొరిడా రాష్ట్రంలోని పనామాలో అతిపెద్ద డైవింగ్ అండ్ సాల్వేజ్ కేంద్రం ఉంది. ఇక్కడ సముద్రంలో అత్యంత లోతుల్లోకి వెళ్లే డైవర్లు ఉన్నారు. వీరిని రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఇక వేసవిలో నాటో దళాలు బాల్టిక్ సముద్రంలో నిర్వహించే ‘బాల్టాప్స్22’ యుద్ధ విన్యాసాల ముసుగులో ఈ డైవర్ల సాయంతో గ్యాస్ పైప్లైన్ వద్దకు సీ4 అనే పేలుడు పదార్థాలను చేర్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన అమెరికా పీ8 నిఘా విమానం ఆ ప్రాంతంలో ప్రయాణిస్తూ ప్రత్యేక సోనార్లను జారవిడిచింది. అవి విడుదల చేసిన సంకేతాలతో సీ4లు పేలి పైపులైన్లు ధ్వంసమైనట్లు హెర్ష్ కథనంలో పేర్కొన్నాడు. నార్డ్స్ట్రీమ్ 1,2 పైపులైన్ల వద్ద మూడు చోట్ల లీకులు ఏర్పడ్డాయి. రష్యానే అప్పట్లో ఈ పేలుడుకు పాల్పడిందని అమెరికా, నాటో ఆరోపణలు గుప్పించాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొన్నాయి.
ఇక ఐరోపా దేశాలకు రష్యా గ్యాస్ సరఫరా గణనీయంగా పడిపోయింది. ఆ దేశాలు అమెరికా(USA), అజర్బైజన్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకొని శీతాకాలాన్ని నెట్టుకొచ్చాయి.
ఏమిటీ నార్డ్స్ట్రీమ్ పైపులైన్..!
రష్యాలో భారీ ఎత్తున సహజవాయు క్షేత్రాలు ఉన్నాయి. ఫలితంగా అత్యధికంగా, చౌకగా గ్యాస్ ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఉంది. ఇక్కడి నుంచి చౌకగా గ్యాస్ను జర్మనీకి సరఫరా చేయడానికి 1,224 కిమీ పొడవునా బాల్టిక్ సముద్రంలో నార్డ్స్ట్రీమ్1 పైపులైన్ నిర్మించారు. రష్యాకు చెందిన గ్యాజ్ప్రోమ్ మరో నాలుగు ఐరోపా సంస్థలు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి. జర్మనీకి దీని నుంచి అత్యధికంగా గ్యాస్ వెళ్లేది. ఈ ప్రాజెక్టును విస్తరిస్తూ 2015లో నార్డ్స్ట్రీమ్ 2 పైప్లైన్ ఏర్పాటు చేయనున్నట్లు రష్యాకు చెందిన గ్యాజ్ప్రోమ్, మరికొన్ని ఐరోపా సంస్థలు ప్రకటించాయి. దీనిని అమెరికా(USA), యూకే, ఉక్రెయిన్, ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు వ్యతిరేకించాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మాస్కోకు ఐరోపా సమాఖ్యపై పట్టు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, 2021 సెప్టెంబర్లో నిర్మాణం పూర్తయింది. దీనికి జర్మనీ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి రాకపోవడంతో పక్కనపెట్టారు. ఈ పైప్లైన్ నిర్మాణానికి 11 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించారు.
అవి తప్పుడు ఆరోపణలు..: అమెరికా
నార్డ్స్ట్రీమ్ గ్యాస్ పైప్లైన్ను అమెరికా(USA) పేల్చివేసిందని వచ్చిన ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది. అవి శుద్ధ అబద్ధాలని, పూర్తిగా కల్పితాలని పేర్కొంది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, విదేశాంగ శాఖలు కూడా ఇలాంటి సమాధానాలే చెప్పాయి. పైప్లైన్ పేలుళ్లు జరిగిన ప్రదేశాలకు సమీపంలోని స్వీడన్, డెన్మార్క్ దేశాలు మాత్రం ఎవరిపేరు ప్రస్తావించలేదు.. కానీ, ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అని మాత్రం పేర్కొన్నాయి. ఇక ఈ కథనంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ కుట్ర వెనుక ఉన్న వారు పరిణామాలు అనుభవిస్తారని పేర్కొంది. స్వీడన్, డెన్మార్క్లు తమ విచారణకు సహకరించాలని కోరింది. కానీ.. అవి నిరాకరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ