USA: ‘ఇది ఆరంభం మాత్రమే’.. పశ్చిమాసియాలోని మిలిటెంట్లకు అమెరికా హెచ్చరిక
USA: పశ్చిమాసియాలో ఘర్షణను కోరుకోవడం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలీవన్ పునరుద్ఘాటించారు. అయితే, అమెరికన్ల జోలికి వస్తే సహించేది లేదని, మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు.
జెరూసలెం: ఇరాక్, సిరియాలో తాము ఇటీవల జరిపిన ప్రతీకార దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని అమెరికా (USA) ఆదివారం తెలిపింది. ఇరాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు మరిన్ని చర్యలు ఉంటాయని హెచ్చరించింది. శుక్రవారం నాటి దాడులతో ఆ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూప్ల సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అగ్రరాజ్య జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలీవన్ తెలిపారు.
పశ్చిమాసియాలో ఘర్షణను కోరుకోవడం లేదని సలీవన్ పునరుద్ఘాటించారు. అయితే, అమెరికన్ల (USA) జోలికి వస్తే సహించేది లేదని, మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్లోనూ దాడులు జరిపారా? అని అడిగిన ప్రశ్నపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. శుక్రవారం నాటి దాడుల తర్వాత సిరియాలోని అమెరికా స్థావరంపై మరో దాడి జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. ఇరాన్ మద్దతుతో సిరియా, ఇరాక్లో ఉన్న మిలిటెంట్లు, హూతీల నుంచి భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు ఉండబోవని కచ్చితంగా చెప్పలేమన్నారు. అందుకే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని బైడెన్ తమ సైన్యాన్ని ఆదేశించారని స్పష్టం చేశారు.
క్వాడ్పై అమెరికా పునరాలోచనలో పడ్డ వేళ..
జోర్డాన్లో ఇటీవల తమ సైనికులు ముగ్గురు మృతి చెందిన ఘటనకు సంబంధించి అమెరికా శుక్రవారం ప్రతీకార దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాక్, సిరియాల్లోని ఇరాన్ మద్దతుదారులైన మిలిటెంట్లు, రెవల్యూషనరీ గార్డు దళం (IRGC) స్థావరాలపై దీర్ఘశ్రేణి బీ-1 బాంబర్లతో విరుచుకుపడింది. 85కు పైగా శత్రు స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. జోర్డాన్లో అమెరికా స్థావరాలపై జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. యూఎస్ మాత్రం దాన్ని ఖండిస్తోంది. ఈ దాడులకు బాధ్యత వహించిన ఇరాక్లోని ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్’నకు ఐఆర్జీసీయే నిధులు సమకూరుస్తోందని.. కావాల్సిన శిక్షణనిస్తోందని ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ