Ukraine Crisis: ఉక్రెయిన్లో ఆయుధ కుంభవృష్టి ఇలా..!
పోలాండ్లోని ఉక్రెయిన్కు సరిహద్దు పల్లెల్లో రాత్రి పగలు తేడా లేకుండా భారీ ట్రక్కుల, భారీ సైనిక కార్గో విమానాల రణగొణధ్వనులు పెరిగిపోయాయి. ఉక్రెయిన్పై దాడికి వచ్చిన రష్యా సైనిక కాన్వాయ్లను తుత్తనీయులు
రద్దీగా పోలాండ్ సరిహద్దులు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పోలాండ్లోని ఉక్రెయిన్కు సరిహద్దు పల్లెల్లో రాత్రి పగలు తేడా లేకుండా భారీ ట్రక్కుల, భారీ సైనిక కార్గో విమానాల రణగొణధ్వనులు పెరిగిపోయాయి. ఉక్రెయిన్పై దాడికి వచ్చిన రష్యా సైనిక కాన్వాయ్లను తుత్తనీయులు చేసే ఆయుధాలు మొత్తం ఇక్కడి నుంచి అత్యంత రహస్యంగా ఉక్రెయిన్లోని కీలక నగరాలకు చేరుతున్నాయి. మూడంచెల విధానంలో వీటిని ఉక్రెయిన్ బలగాలకు అందేట్లు నాటో చర్యలు తీసుకొంది. ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలు, యాంటీ ట్యాంక్ మిసైల్స్ను నాటో యద్ధ ప్రాతిపదికన తరలిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఆయుధ రవాణా ఇదే కావడం విశేషం.
మూడు ప్రమాదకర దశల్లో..
ఉక్రెయిన్ రణక్షేత్రంలోని సైనికులకు ఆయుధాలు, ఇంధనం వంటివి సరఫరా చేయడం రక్షణ రంగంలో అత్యంత కీలకమైనది. వాస్తవానికి రష్యా ఇంటెలిజెన్స్ కన్నుగప్పి వీటిని తరలించడం కత్తిమీద సాముగా మారింది. కానీ, నాటోదళాలు దీనిని విజయవంతంగా చేస్తున్నాయి.
తొలిదశలో భాగంగా ఉక్రెయిన్కు అవసరమైన ఆయుధాలను తెలుసుకొని అవి ఐరోపాలోని నాటోదేశాల్లో ఉన్న అమెరికా ఆయుధ గోదాముల్లో ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తారు. ఆ తర్వాత వాటిని తీసి విమానాలు, రైళ్లు, ట్రక్కుల్లో లోడ్ చేసి ఉక్రెయిన్ సరిహద్దులు ఉన్న పోలాండ్, స్లొవేకియా, హంగేరి, రొమేనియాలకు తరలిస్తున్నారు. తొలిదశలో ఈ ఆయుధాలు నాటోదేశాల మీదుగానే ప్రయాణిస్తాయి. ఆయుధ లోడు కదలికలు రష్యాకు ఏమాత్రం అనుమానం రాకుండా పక్కా జాగ్రత్తలు తీసుకొంటారు. అవసరమైతే ఏమార్చే విధంగా రూట్మ్యాప్ను తయారు చేసుకొంటారు.
ఈ క్రమంలో ఆయుధ లోడును పలు చోట్లకు మారుస్తారు.. దీనిని స్టేజింగ్ ఏరియా అంటారు. ఆయుధ సరఫరాలో ఇవి ఒక్కటే ఉండొచ్చు.. దూరాన్ని పలు నాటో దేశాల్లో స్టేజింగ్ ఏరియాలు ఏర్పాటు చేయవచ్చు. సాధారణంగా ఆ దేశంలోని సైనిక స్థావరాలను వీటికి వాడతారు. ఉక్రెయిన్లో ఏ ప్రాంతానికి ఆయుధాలు పంపాలి, ఆ మార్గంలోని రోడ్లు, వంతెనల స్థితి, రష్యా దళాల కదలికలు, ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ లోడ్కు లభించే భద్రత అన్నదానిని బట్టి ఈ రూట్మ్యాప్ ఆధారపడి ఉంటుంది.
రెండో దశలో ఆయుధాలు నాటో దేశం నుంచి సరిహద్దులు దాటి ఉక్రెయిన్కు చేరతాయి. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆయుధాలను సరఫరా చేసే బాధ్యత ఉక్రెయిన్ప్రభుత్వానిదే. ఇది అత్యంత కఠినమైన దశ. నాటో ఉక్రెయిన్పై నోఫ్లై జోన్ ప్రకటించకపోవడంతో రష్యా విమానాలు అక్కడి గగనతలంపై ఆధిపత్యం చూపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ ఈ ఆయుధాలను తరలించేందుకు విమానాలు, హెలికాప్టర్లు వాడలేదు. దీంతో భూమార్గంలో ట్రక్కుల ద్వారా తరలించాలి. భారీ కాన్వాయ్లు కనిపిస్తే రష్యా విమానాలు వాటిని ధ్వంసం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఆయుధ లోడ్ను విడగొట్టి వేర్వేరుగా పంపిస్తున్నారు. ఈ కాన్వాయ్లకు సాయుధ సైనికులు స్టింగర్లు, జావెలిన్ వంటి క్షిపణులతో భద్రత కల్పిస్తారు. కాన్వాయ్లను వేగంగా పంపేలా రోడ్లను క్లియర్ చేయడానికి ప్రత్యేక దళాలు అవసరం.
ఇక ఉక్రెయిన్లోని నగరాలకు చేరిన ఆయుధ లోడ్ను చిన్నచిన్న భాగాలుగా మార్చి క్షేత్రస్థాయిలో సైనికులకు అందజేస్తారు. ఇది చివరి దశ. కానీ, ఈ దశలో రష్యా నుంచి ప్రమాదం తీవ్రంగా పొంచి ఉంటుంది. ఆ దేశ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకులు ఆయుధలోడుపై దాడి చేయకుండా పటిష్ఠమైన భద్రత మధ్య వీటిని తరలిస్తారు.
అక్కరకొచ్చిన మిలటరీ గ్రేడ్ రన్వే..!
ఉక్రెయిన్కు 65 కిలోమీటర్ల దూరంలోని జెస్జో నగరం ఇప్పుడు ఆయుధ తరలింపులకు కీలకంగా మారింది. ఈ నగరంలో ఉన్న విమానాశ్రయంలో మిలటరీ గ్రేడ్ రన్వే ఉండటంతో సీ-130 వంటి భారీ విమానాలు దిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ అమెరికాకు చెందిన 82వ ఎయిర్బార్న్ డివిజన్ సైనికులు ఇక్కడ ఆయుధ లోడ్లను వేగంగా దించి తరలించేందుకు పనిచేస్తున్నారు. ఇక టర్కీ వంటి దేశాలు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లకు దొరకని గల్ఫ్స్ట్రీమ్ 450 విమానాల ద్వారా ఆయుధాలను పంపిస్తున్నాయి. ఇక్కడ ఉక్రెయిన్ ట్రక్కుల్లో వీటిని లోడ్ చేసి పంపిస్తున్నారు. రాత్రివేళల్లో గ్రామాల మీదుగా కూడా ఇవి సరిహద్దులు దాటి వెళుతున్నాయి. నాటో బలగాలు ఈ ప్రాంతాలకు జర్నలిస్టులను వచ్చినా ఇష్టపడటంలేదు. ఇక్కడి రన్వేకు ఎటువంటి ముప్పు లేకుండా అమెరికా పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది.
నాటోలోని కొన్ని దేశాలు ఈ స్థాయిలో ఆయుధాల తరలింపు ఇబ్బందికర పరిస్థితి సృష్టించవచ్చని భయపడుతున్నాయి. ఈ ఆయుధాలు చివరికి రష్యన్ల చేతిలో పడే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. అంతేకాదు.. ఉక్రెయిన్ నుంచి బ్లాక్మార్కెట్లోకి వెళ్లి ఉగ్రవాదుల చేతిలో పడే ముప్పు ఉన్నట్లు భయపడుతున్నాయి.
ఉక్రెయిన్కు సోవియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్..
అమెరికా ప్రభుత్వం గతంలో రహస్యంగా సంపాదించిన సోవియట్ కాలం నాటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తాజాగా ఉక్రెయిన్కు చేర్చింది. ఈ విషయాన్ని వాల్స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. వాస్తవానికి ప్రత్యర్థి దేశాల ఆయుధ సామర్థ్యాన్ని అంచనావేయడం కోసం అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు దీనిని సంపాదించాయి. తాజాగా ఉక్రెయిన్కు ఎయిర్ డిఫెన్స్ అవసరం చాలా ఉండటంతో దీనిని పంపింది. అది ఏరకం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. 1994లో బెలారస్ నుంచి అమెరికా ఎస్-300 వ్యవస్థను సంపాదించింది.
గతంలో సోవియట్ యూనియన్లో భాగమైనా చాలా దేశాలు ఇప్పుడు నాటోలో సభ్యత్వం పొందాయి. ఉక్రెయిన్ సేనలకు కూడా సోవియట్ వాడిన ఆయుధాల వినియోగంపై పట్టుంది. ఈ నేపథ్యంలో నాటోలోని మాజీ సోవియట్ దేశాలైన చెక్ రిపబ్లిక్, స్లొవేకియా వంటి దేశాలు తమ వద్ద ఉన్న పాత ఆయుధాలను ఉక్రెయిన్కు అందించాయి. పోలాండ్ ఒక దశలో మిగ్-29 విమానాలను కూడా ఇచ్చేందుకు మందుకు వచ్చింది. కానీ, అమెరికా అంగీకరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?