Sand: భూమ్మీద ఇసుక ఇక దొరకదా..?
ఇసుక.. ఈ భూమ్మీద నీటి తర్వాత అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరు. దీని వాడకానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. అందుకేనేమో.. ఇసుక అక్రమ తవ్వకాలు.. మాఫియా ఇలా ఎన్నో కుంభకోణాలు
ఇంటర్నెట్డెస్క్: ఇసుక.. ఈ భూమ్మీద నీటి తర్వాత అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరు. దీని వాడకానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. అందుకేనేమో.. ఇసుక అక్రమ తవ్వకాలు.. మాఫియా ఇలా ఎన్నో కుంభకోణాలు వెలుగుచూస్తుంటాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా సంగ్రహించే ఘన పదార్థమైన ఇసుక.. నానాటికీ భూమ్మీద కనుమరుగవుతోందట. త్వరలోనే ఈ భూమండలం ‘ఇసుక కొరత’ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశముందట. ఈ మేరకు యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రొగ్రామ్ (యూఎన్ఈపీ) హెచ్చరించింది.
‘‘ఇసుక వనరులపై మెరుగైన నియంత్రణ లేకుంటే మన అవసరాలు తీరవు. ప్రస్తుతం మనం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాం. దీనిపై ఇప్పుడు చర్యలు చేపడితేనే ఇసుక సంక్షోభాన్ని తప్పించుకోగలం’’ అని యూఎన్ఈపీ ఎకానమీ విభాగ అధిపతి షీలా అగర్వాల్ ఖాన్ తెలిపారు. వందల, వేల ఏళ్లు భౌగోళిక ప్రక్రియ ద్వారా ఇసుక ఏర్పడుతోందని, అయితే మనం దాని ఆవిర్భావం కంటే వేగంగా ఇసుకను వినియోగించుకుంటున్నామని యూఎస్ఈపీ తెలిపింది.
గ్లాస్, కాంక్రీట్, భవన నిర్మాణాలు ఇలా అనేక వాటిల్లో ఉపయోగించే ఈ ఇసుక వినియోగం గత రెండు దశాబ్దాలుగా మూడు రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 50 బిలియన్ టన్నుల ఇసుకను వినియోగిస్తున్నాం. ఇది నదులు, తీర ప్రాంతాలకు హానికరంగా మారుతుండటమే గాక, చిన్న చిన్న దీవులను తుడిచిపెడుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీని వల్ల పర్యావరణ సంక్షోభం ఏర్పడుతోందని పేర్కొంది. ‘‘పర్యావరణాన్ని నియంత్రించడంలో ఇసుక కీలక పాత్ర పోషిస్తోంది. తుపానుల నుంచి రక్షించడంతో పాటు అనేక వృక్ష, జంతు జాతులకు ఆవాసంగా మారుతోంది. నియంత్రణ లేని ఇసుక వినియోగం వల్ల పర్యావరణానికి భంగం కలగడంతో పాటు జీవవైవిధ్యంపైనా ఒత్తిడి కలిగిస్తోంది. తీర ప్రాంతాల్లో ఇసుక తగ్గడంతో శక్తిమంతమైన తుపానులు వచ్చే ప్రమాదం ఉంటోంది’’ అని యూఎన్ఈపీ వెల్లడించింది.
ఇసుక ఎలా ఏర్పడుతుంది..
ఈ భూమ్మీద ఉండే పెద్ద పెద్ద శిలలు వాతావరణ ప్రభావం వల్ల కాలం గడిచే కొద్దీ అరుగుతూ.. వివిధ పదార్థాలుగా విడిపోతాయి. ఆమ్ల వర్షాల వల్ల రసాయన సంఘటనలు ఏర్పడి ఆ శిలలు ఖనిజాలు, క్వార్ట్జ్(సిలికా), పొటాషియం, సోడియం, అల్యూమినియం క్రిస్టల్స్గా విడిపోతాయి. అలా ఏర్పడిన సిలికా ఇసుక రేణువులుగా రూపాంతంరం చెందుతుంది. నదులలో నీటీ ప్రవాహం కారణంగా రాళ్లు కొట్టుకొనిపోతూ రాపిడికి గురై రాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఇసుకగా ఏర్పడుతుంది. అందుకే నదులలో, బీచ్లలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా మారడానికి వందలు, వేలాది సంవత్సరాలు పడుతుంది. వర్షాభావ ప్రాంతాల్లో ఇసుక గాలితో పాటు లేచి ఒక చోట నిక్షిప్తం కావడంతో ఇసుక దిబ్బలుగా ఏర్పడుతాయి, వీటినే ఎడారులు అంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!