DK Aruna: హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడం శోచనీయం: డీకే అరుణ

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శాసనసభ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆమెను గద్వాల ఎమ్మెల్యేగా నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను శాసనసభ కార్యదర్శికి అందించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే, ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి కోర్టు ఉత్తర్వులను అందించారు. హైకోర్టు తీర్పును కూడా అమలు చేయకపోవడం శోచనీయమని ఈ సందర్భంగా డీకే అరుణ అన్నారు. అందుకే కోర్టు కాపీని అందజేసేందుకు శాసనసభకు వచ్చినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించి తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు తీర్పు ఇంకా ముందు వచ్చి ఉంటే బాగుండేదన్నారు.   

Updated : 01 Sep 2023 14:21 IST

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శాసనసభ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆమెను గద్వాల ఎమ్మెల్యేగా నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను శాసనసభ కార్యదర్శికి అందించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే, ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి కోర్టు ఉత్తర్వులను అందించారు. హైకోర్టు తీర్పును కూడా అమలు చేయకపోవడం శోచనీయమని ఈ సందర్భంగా డీకే అరుణ అన్నారు. అందుకే కోర్టు కాపీని అందజేసేందుకు శాసనసభకు వచ్చినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించి తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు తీర్పు ఇంకా ముందు వచ్చి ఉంటే బాగుండేదన్నారు.   

Tags :

మరిన్ని