DK Aruna: హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడం శోచనీయం: డీకే అరుణ
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శాసనసభ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆమెను గద్వాల ఎమ్మెల్యేగా నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను శాసనసభ కార్యదర్శికి అందించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే, ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి కోర్టు ఉత్తర్వులను అందించారు. హైకోర్టు తీర్పును కూడా అమలు చేయకపోవడం శోచనీయమని ఈ సందర్భంగా డీకే అరుణ అన్నారు. అందుకే కోర్టు కాపీని అందజేసేందుకు శాసనసభకు వచ్చినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ఇంకా ముందు వచ్చి ఉంటే బాగుండేదన్నారు.
Updated : 01 Sep 2023 14:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్