Odisha: ఒడిశాలో కనిపించకుండా పోయిన మహిళా క్రికెటర్‌ మృతి..!

జనవరి 11 నుంచి కనిపించకుండా పోయిన ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వయిన్.. కటక్  జిల్లాలోని అడవుల్లో ఓ చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించింది. రాబోయే జాతీయ స్థాయి టోర్నీకి ఒడిశా క్రికెట్ అసోసియేషన్  ప్రకటించిన లిస్ట్‌లో రాజశ్రీ పేరు లేదు. దీంతో ఆమె మనస్థాపానికి గురై ఉరేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, రాజశ్రీ ముఖంతోపాటు కంటి మీద గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Published : 14 Jan 2023 16:54 IST

జనవరి 11 నుంచి కనిపించకుండా పోయిన ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వయిన్.. కటక్  జిల్లాలోని అడవుల్లో ఓ చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించింది. రాబోయే జాతీయ స్థాయి టోర్నీకి ఒడిశా క్రికెట్ అసోసియేషన్  ప్రకటించిన లిస్ట్‌లో రాజశ్రీ పేరు లేదు. దీంతో ఆమె మనస్థాపానికి గురై ఉరేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, రాజశ్రీ ముఖంతోపాటు కంటి మీద గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Tags :

మరిన్ని