Khammam: మాస్టారూ.. మళ్లీ మీరే రావాలంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు

తమ అభిమాన టీచర్‌ బదిలీపై వెళ్తున్నారని తెలిసి కన్నీటిపర్యంతమైన విద్యార్థినులు.. ఆయన మళ్లీ రావాలంటూ నేడు రోడ్డెక్కారు.  ఖమ్మం జిల్లా కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు తన డిప్యుటేషన్ రద్దు కావడంతో కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. ఆయన వెళ్తున్న సమయంలో విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. వెళ్లొద్దంటూ బోరున విలపించారు. అయితే ఆయన స్థానంలో మరో ప్రధానోపాధ్యాయుడు విధుల్లో చేరారు. ఈ క్రమంలో విద్యార్థినులు పాత హెచ్ఎం నాగేశ్వరరావు మళ్లీ రావాలంటూ పాఠశాల ఎదుట బైఠాయించారు. ‘రావాలి.. రావాలి.. హెచ్ఎం సార్ రావాలి’ అంటూ నిరసనకు దిగారు. 

Updated : 07 Nov 2022 11:52 IST

తమ అభిమాన టీచర్‌ బదిలీపై వెళ్తున్నారని తెలిసి కన్నీటిపర్యంతమైన విద్యార్థినులు.. ఆయన మళ్లీ రావాలంటూ నేడు రోడ్డెక్కారు.  ఖమ్మం జిల్లా కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు తన డిప్యుటేషన్ రద్దు కావడంతో కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. ఆయన వెళ్తున్న సమయంలో విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. వెళ్లొద్దంటూ బోరున విలపించారు. అయితే ఆయన స్థానంలో మరో ప్రధానోపాధ్యాయుడు విధుల్లో చేరారు. ఈ క్రమంలో విద్యార్థినులు పాత హెచ్ఎం నాగేశ్వరరావు మళ్లీ రావాలంటూ పాఠశాల ఎదుట బైఠాయించారు. ‘రావాలి.. రావాలి.. హెచ్ఎం సార్ రావాలి’ అంటూ నిరసనకు దిగారు. 

Tags :

మరిన్ని