Kodandaram: వచ్చే ఎన్నికల్లో విపక్షాలు కలిసి పనిచేయాలి: కోదండరామ్

ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా కలిసి పనిచేయాలని తెజస అధ్యక్షుడు కోదండ రామ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా భారాస ప్రభుత్వం నియంతృత్వ విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. తెజసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు వినిపిస్తున్నాయన్న మీడియా ప్రశ్నను.. కోదండరామ్‌ తోసి పుచ్చారు. ప్రజల ఆకాంక్షలు అమలు చేసేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు. సూర్యాపేటలో తెజస ప్లీనరీ సమావేశాల్లో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ఈ మేరకు ఆయన మాట్లాడారు. 

Published : 04 Jun 2023 22:29 IST

ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా కలిసి పనిచేయాలని తెజస అధ్యక్షుడు కోదండ రామ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా భారాస ప్రభుత్వం నియంతృత్వ విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. తెజసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు వినిపిస్తున్నాయన్న మీడియా ప్రశ్నను.. కోదండరామ్‌ తోసి పుచ్చారు. ప్రజల ఆకాంక్షలు అమలు చేసేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు. సూర్యాపేటలో తెజస ప్లీనరీ సమావేశాల్లో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ఈ మేరకు ఆయన మాట్లాడారు. 

Tags :

మరిన్ని