Viral Video: కోడిగుడ్లు లేవన్నందుకు సూపర్ మార్కెట్ యజమానిపై యువకుల దాడి..!
కోడిగుడ్లు లేవన్నందుకు సూపర్ మార్కెట్ యజమానిపై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగింది. గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సూపర్ మార్కెట్కు గుండారం గ్రామానికి చెందిన నర్సింహులు, డేవిడ్లు మద్యం సీసాలతో వచ్చారు. కోడి గుడ్లు ఉన్నాయా? అని అడిగారు. లేవని యజమాని జలపతిరెడ్డి సమాధానం ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరు యువకులూ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ.. యజమానిపై దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Updated : 26 Mar 2024 22:21 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్