బ్రేకింగ్

breaking
19 Apr 2024 | 07:02 IST

తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తొలిదశ కింద 102 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఏడు దశల్లో ఇదే అతిపెద్దది. ఇందులో భాగంగా 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్‌ పూర్తికానుంది. తొలిదశలో మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు 35.67 లక్షల మంది, 20-29 ఏళ్ల మధ్య వయసు వారు 3.51 కోట్లు ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో కూడా నేడు పోలింగ్‌ జరుగుతోంది.

మరిన్ని

తాజా వార్తలు