icon icon icon
icon icon icon

చంద్రబాబు రోడ్‌షోలో వైకాపా కవ్వింపు చర్యలు

తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన రోడ్‌షోలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి.

Updated : 02 May 2024 08:43 IST

మంత్రి రజిని కార్యాలయం వద్ద రెచ్చగొట్టిన వైకాపా శ్రేణులు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-పట్టాభిపురం: తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన రోడ్‌షోలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. చంద్రమౌళినగర్‌లో మంత్రి విడదల రజిని కార్యాలయం వద్ద వైకాపా కార్యకర్తలు జెండాలు ఊపుతూ అక్కడున్న తెదేపా శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. దీనికి ప్రతిగా తెదేపా కార్యకర్తలు జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తూ అరుపులు, కేకలతో మంత్రి కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు స్పందించలేదు. రోడ్‌షోలో అపశ్రుతి జరగడం భావ్యం కాదని భావించిన తెదేపా నేతలు.. కార్యకర్తలను సముదాయించి అక్కడి నుంచి రోడ్డు అవతలికి పంపారు. కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా వైకాపా వాళ్లను లోపలికి పంపితేనే వెళతామని పట్టుబట్టారు. ఎట్టకేలకు రంగంలోకి దిగిన పోలీసులు హడావుడిగా వైకాపా కార్యకర్తలను కార్యాలయం లోపలికి పంపారు. దీంతో తెదేపా కార్యకర్తలు ముందుకు కదిలారు. చంద్రబాబు రోడ్‌షో మార్గంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకుండా వదిలేసి చోద్యం చూస్తూ నిలబడ్డారు. దీంతో రోడ్‌షో ఆలస్యంగా సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img