బ్రేకింగ్

breaking
04 May 2024 | 12:16 IST

న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తోంది: షర్మిల

కడప: ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ‘‘వైకాపా ముఖ్యులంతా ఒక ముఠాగా తయారయ్యారు. అంజాద్‌, మల్లికార్జున్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి అంతా దోపిడీమయమే. కడపలో వైకాపా చేసిన అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి హోదా లేదు.. రాజధాని లేదు. మద్యం ఏరులు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు. న్యాయం కోసం వైఎస్‌ వివేకా ఆత్మ ఘోషిస్తోంది’’ అని షర్మిల అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు