News In Pics: చిత్రం చెప్పే సంగతులు -02(23-01-2023)

Updated : 23 Jan 2023 22:08 IST
1/24
జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌లో బోట్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు అక్కడ ఏర్పాటు చేసిన ట్యాంకులో జలకన్యల్లాగా ‘మెర్మైడింగ్‌’ అనే డైవింగ్‌ చేశారు. జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌లో బోట్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు అక్కడ ఏర్పాటు చేసిన ట్యాంకులో జలకన్యల్లాగా ‘మెర్మైడింగ్‌’ అనే డైవింగ్‌ చేశారు.
2/24
భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు అతియాశెట్టిని కుటుంబసభ్యుల సమక్షంలో వివాహమాడాడు. మహారాష్ట్ర, ఖండాలలోని ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం జరిగింది.. భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు అతియాశెట్టిని కుటుంబసభ్యుల సమక్షంలో వివాహమాడాడు. మహారాష్ట్ర, ఖండాలలోని ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం జరిగింది..
3/24
4/24
హైదరాబాద్‌లోని గాజులరామారంలో చిత్తారమ్మ జాతర రెండో రోజు సోమవారం ఘనంగా సాగింది. ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌లోని గాజులరామారంలో చిత్తారమ్మ జాతర రెండో రోజు సోమవారం ఘనంగా సాగింది. ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
5/24
భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మంగళవారం మూడో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇందౌర్‌లోని మైదానంలో భారత క్రీడాకారులు సాధన చేస్తూ కనిపించారు. ఇప్పటికే భారత్‌ రెండు వన్డేల్లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మంగళవారం మూడో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇందౌర్‌లోని మైదానంలో భారత క్రీడాకారులు సాధన చేస్తూ కనిపించారు. ఇప్పటికే భారత్‌ రెండు వన్డేల్లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
6/24
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదినం సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద తెదేపా కార్యకర్తలు ‘యువగళం’ పాదయాత్ర లోగోతో ఉన్న భారీ కేకును కోసి సంబరాలు చేసుకున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదినం సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద తెదేపా కార్యకర్తలు ‘యువగళం’ పాదయాత్ర లోగోతో ఉన్న భారీ కేకును కోసి సంబరాలు చేసుకున్నారు.
7/24
చిరంజీవి హీరోగా కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. 10రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. చిరంజీవి హీరోగా కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. 10రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.
8/24
ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ఆటోమొబైల్‌ దుకాణాన్ని సినీనటి పాయల్‌ రాజ్‌పూత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నృత్యం చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ఆటోమొబైల్‌ దుకాణాన్ని సినీనటి పాయల్‌ రాజ్‌పూత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నృత్యం చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.
9/24
అభిమానులకు హాయ్‌ చెబుతున్న పాయల్‌ రాజ్‌పూత్‌ అభిమానులకు హాయ్‌ చెబుతున్న పాయల్‌ రాజ్‌పూత్‌
10/24
పారిస్‌లో నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ వినూత్నంగా పులులు, సింహాల బొమ్మలతో ఉన్న దుస్తులతో ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. పారిస్‌లో నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ వినూత్నంగా పులులు, సింహాల బొమ్మలతో ఉన్న దుస్తులతో ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.
11/24
12/24
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయంలో ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయంలో ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
13/24
సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఫర్హాద్‌ షంజీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’. వెంకటేశ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఫర్హాద్‌ షంజీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’. వెంకటేశ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
14/24
కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతోంది. ఇందులోభాగంగా పర్యటిస్తున్న రాహుల్‌గాంధీకి ఓ వ్యక్తి ఇలా బాహుబలి వేషధారణలో ఉన్న ఆయన పోస్టర్‌ను బహూకరించి అభిమానం చాటుకున్నాడు. కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతోంది. ఇందులోభాగంగా పర్యటిస్తున్న రాహుల్‌గాంధీకి ఓ వ్యక్తి ఇలా బాహుబలి వేషధారణలో ఉన్న ఆయన పోస్టర్‌ను బహూకరించి అభిమానం చాటుకున్నాడు.
15/24
విజయవాడలోని రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో సోమవారం నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో సోమవారం నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
16/24
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్నాన్ని తీర్చిదిద్దారు. స్వాతంత్రోద్యమ కాలంలో నేతాజీ ‘నాకు రక్తాన్నివ్వండి.. మీకు స్వేచ్ఛనిస్తాను’ అనే నినాదంతో భారతీయుల్లో జోష్‌ పెంచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్నాన్ని తీర్చిదిద్దారు. స్వాతంత్రోద్యమ కాలంలో నేతాజీ ‘నాకు రక్తాన్నివ్వండి.. మీకు స్వేచ్ఛనిస్తాను’ అనే నినాదంతో భారతీయుల్లో జోష్‌ పెంచారు.
17/24
భారత నావికాదళంలోకి మరో అత్యాధునిక, శక్తిమంతమైన జలాంతర్గామి చేరింది.‘కల్వరి క్లాస్‌’కు చెందిన ‘వాజిర్’జలాంతర్గామి ఈరోజు అధికారికంగా భారత నావికాదళంలోకి చేరింది. దీంతో ముంబయిలో నావికాదళ సిబ్బంది విన్యాసాలు చేశారు. భారత నావికాదళంలోకి మరో అత్యాధునిక, శక్తిమంతమైన జలాంతర్గామి చేరింది.‘కల్వరి క్లాస్‌’కు చెందిన ‘వాజిర్’జలాంతర్గామి ఈరోజు అధికారికంగా భారత నావికాదళంలోకి చేరింది. దీంతో ముంబయిలో నావికాదళ సిబ్బంది విన్యాసాలు చేశారు.
18/24
ఈరోజు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి సందర్భంగా కేటీఆర్‌ ట్విటర్‌లో ఈ ఫొటోను పంచుకున్నారు. ‘భరతమాత ముద్దుబిడ్డ, ధైర్యశీలి సుభాష్‌ చంద్రబోస్‌ 126వ జయంతి సందర్భంగా ఆయనకు నా వందనాలు’ అని బోస్‌ ఫొటోను ట్వీట్‌ చేశారు. ఈరోజు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి సందర్భంగా కేటీఆర్‌ ట్విటర్‌లో ఈ ఫొటోను పంచుకున్నారు. ‘భరతమాత ముద్దుబిడ్డ, ధైర్యశీలి సుభాష్‌ చంద్రబోస్‌ 126వ జయంతి సందర్భంగా ఆయనకు నా వందనాలు’ అని బోస్‌ ఫొటోను ట్వీట్‌ చేశారు.
19/24
జస్టిన్ డుపాంట్ (ఎడమ), కీలా కెన్నెల్లీ హవాయిలోని సముద్ర తీరంలో అలలపై ఇలా రైడ్‌ చేసి ఆకట్టుకున్నారు. జస్టిన్ డుపాంట్ (ఎడమ), కీలా కెన్నెల్లీ హవాయిలోని సముద్ర తీరంలో అలలపై ఇలా రైడ్‌ చేసి ఆకట్టుకున్నారు.
20/24
సినీ నటి, యాంకర్‌ అనసూయ నిజామాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. సినీ నటి, యాంకర్‌ అనసూయ నిజామాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు.
21/24
ఈరోజు తెదేపా  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టిన రోజు సందర్భంగా నెల్లూరు నగరంలో అభిమానులు భారీ కేకును కట్‌ చేసి తమ అభిమానం చాటుకున్నారు. తెదేపా నెల్లూరు నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో ‘యువనాయక’ పేరుతో ఓ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈరోజు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టిన రోజు సందర్భంగా నెల్లూరు నగరంలో అభిమానులు భారీ కేకును కట్‌ చేసి తమ అభిమానం చాటుకున్నారు. తెదేపా నెల్లూరు నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో ‘యువనాయక’ పేరుతో ఓ ఫ్లెక్సీని ప్రదర్శించారు.
22/24
వెంకటేష్‌ ప్రధానపాత్రలో, శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ చిత్రం రానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా కాగా.. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 25న ప్రకటించనున్నట్లు ఒక ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ఈ ఫొటో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. వెంకటేష్‌ ప్రధానపాత్రలో, శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ చిత్రం రానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా కాగా.. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 25న ప్రకటించనున్నట్లు ఒక ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ఈ ఫొటో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
23/24
ఇటాలియన్ డ్యాన్స్ కంపెనీ కిటాంబ్‌ చిలీలోని శాంటియాగోలో నిర్వహించిన ‘శాంటియాగో ఏ మిల్’ అంతర్జాతీయ నృత్యం, థియేటర్, విజువల్ ఆర్ట్స్ ఫెస్టివల్‌ అబ్బురపరచింది. భూమి, ఆకాశం మధ్య ఇలా చేసిన ‘కారిల్లోన్.. ది ఫ్లైట్ ఆఫ్ టైమ్’ ప్రదర్శన  ఆకట్టుకుంది. ఇటాలియన్ డ్యాన్స్ కంపెనీ కిటాంబ్‌ చిలీలోని శాంటియాగోలో నిర్వహించిన ‘శాంటియాగో ఏ మిల్’ అంతర్జాతీయ నృత్యం, థియేటర్, విజువల్ ఆర్ట్స్ ఫెస్టివల్‌ అబ్బురపరచింది. భూమి, ఆకాశం మధ్య ఇలా చేసిన ‘కారిల్లోన్.. ది ఫ్లైట్ ఆఫ్ టైమ్’ ప్రదర్శన ఆకట్టుకుంది.
24/24
బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ‘వీరసింహుని విజయోత్సవం’ వేడుకను నిర్వహించారు. కార్యక్రమం అనంతరం నటులు పార్టీ చేసుకున్నారు. సినీనటి హనీరోజ్‌, బాలకృష్ణ చిత్ర విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ‘వీరసింహుని విజయోత్సవం’ వేడుకను నిర్వహించారు. కార్యక్రమం అనంతరం నటులు పార్టీ చేసుకున్నారు. సినీనటి హనీరోజ్‌, బాలకృష్ణ చిత్ర విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

మరిన్ని