News in Pics: చిత్రం చెప్పే సంగతులు-2(14-03-2023)

Updated : 14 Mar 2023 20:11 IST
1/9
ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఒడిశాలోని పూరి తీరంలో ఆస్కార్  అవార్డు విజేతలకు సైకత శిల్పంతో శుభాకాంక్షలు తెలిపారు. ‘నాటు నాటు’ నృత్య చిత్రాన్ని, ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ లఘచిత్రంలోని గజరాజు శిల్పంతోపాటు మధ్యలో ఆస్కార్ ప్రతిమ ఉన్న ఆరడుగుల ఎత్తైన శిల్పాన్ని ఇసుకతో తయారుచేశారు. రెండు భారతీయ చిత్రాలకు అకాడమీ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఒడిశాలోని పూరి తీరంలో ఆస్కార్ అవార్డు విజేతలకు సైకత శిల్పంతో శుభాకాంక్షలు తెలిపారు. ‘నాటు నాటు’ నృత్య చిత్రాన్ని, ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ లఘచిత్రంలోని గజరాజు శిల్పంతోపాటు మధ్యలో ఆస్కార్ ప్రతిమ ఉన్న ఆరడుగుల ఎత్తైన శిల్పాన్ని ఇసుకతో తయారుచేశారు. రెండు భారతీయ చిత్రాలకు అకాడమీ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు.
2/9
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) తన కూతురు కేశినేని శ్వేత.. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీని దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫొటోలను కేశినేన శ్వేత ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) తన కూతురు కేశినేని శ్వేత.. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీని దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫొటోలను కేశినేన శ్వేత ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.
3/9
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఇమ్మడి సిల్వర్ షోరూంను సినీ నటి రీతు వర్మ ప్రారంభించారు. ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఇమ్మడి సిల్వర్ షోరూంను సినీ నటి రీతు వర్మ ప్రారంభించారు. ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.
4/9
శాకుంతలం సినిమా గురించి సమంత ఎమోషనల్‌ పోస్టు చేసింది. ట్విటర్‌ వేదికగా.. ‘ ఈరోజు గుణశేఖర్‌ సర్‌తో కలిసి సినిమా చూశాను. గొప్ప ఇతిహాసాలలో ఒకటిగా.. మనోహరంగా జీవం పోసుకున్న సినిమా ఇది. మా మాయా ప్రపంచాన్ని ప్రేమించబోతున్నారు.  సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతారు. నిర్మాత దిల్‌రాజు, నీలిమలకు నా ధన్యవాదాలు. శాకుంతలం నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమానే’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. శాకుంతలం సినిమా గురించి సమంత ఎమోషనల్‌ పోస్టు చేసింది. ట్విటర్‌ వేదికగా.. ‘ ఈరోజు గుణశేఖర్‌ సర్‌తో కలిసి సినిమా చూశాను. గొప్ప ఇతిహాసాలలో ఒకటిగా.. మనోహరంగా జీవం పోసుకున్న సినిమా ఇది. మా మాయా ప్రపంచాన్ని ప్రేమించబోతున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతారు. నిర్మాత దిల్‌రాజు, నీలిమలకు నా ధన్యవాదాలు. శాకుంతలం నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమానే’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
5/9
ఆఫ్రికాలోని మలావి దేశంలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. ఫ్రెడ్డీ తుపాను ధాటికి ఎటు చూసినా నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి ప్రవాహంలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. ఆఫ్రికాలోని మలావి దేశంలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. ఫ్రెడ్డీ తుపాను ధాటికి ఎటు చూసినా నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి ప్రవాహంలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి.
6/9
సాంకేతికత, ప్రజాప్రయోజనాల కోసం దాని వినియోగం వంటి అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ, నోకియా సీఈఓ పెక్కా లండ్‌మార్క్‌ చర్చించారు. ఈ మేరకు దీనిపై  ఇద్దరు ట్విటర్‌ వేదికగా స్పందించారు. సాంకేతికత, ప్రజాప్రయోజనాల కోసం దాని వినియోగం వంటి అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ, నోకియా సీఈఓ పెక్కా లండ్‌మార్క్‌ చర్చించారు. ఈ మేరకు దీనిపై ఇద్దరు ట్విటర్‌ వేదికగా స్పందించారు.
7/9
నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ తాను హీరోగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా గురించి ఆసక్తిగల ఫొటోను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. ‘అక్షరాల వెనకున్న అంకెలు, ఆ అంకెలే కథకు ఆరంభం.. ఈ పజిల్‌ను డీకోడ్‌ చేయండి’ అంటూ నెటిజన్లకు ప్రశ్న సంధించారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ తాను హీరోగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా గురించి ఆసక్తిగల ఫొటోను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. ‘అక్షరాల వెనకున్న అంకెలు, ఆ అంకెలే కథకు ఆరంభం.. ఈ పజిల్‌ను డీకోడ్‌ చేయండి’ అంటూ నెటిజన్లకు ప్రశ్న సంధించారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
8/9
విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో భారత్, ఆసీస్‌ల మధ్య జరిగే సెకండ్‌ వన్డే మ్యాచ్ టిక్కెట్ల కోసం కౌంటర్‌ వద్ద జనం బారులు తీరిన దృశ్యమిది. 
విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో భారత్, ఆసీస్‌ల మధ్య జరిగే సెకండ్‌ వన్డే మ్యాచ్ టిక్కెట్ల కోసం కౌంటర్‌ వద్ద జనం బారులు తీరిన దృశ్యమిది.
9/9
జనసైనికుల ప్రకటనల మధ్య బందరులో మంగళవారం జరగనున్న జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభకు సిద్ధమైన వారాహి వాహనం..
జనసైనికుల ప్రకటనల మధ్య బందరులో మంగళవారం జరగనున్న జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభకు సిద్ధమైన వారాహి వాహనం..

మరిన్ని