News in pics : చిత్రం చెప్పే సంగతులు (28-03-2024/1)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 28 Mar 2024 13:57 IST
1/10
గోదావరి నదిపై గల రోడ్కం రైలు వంతెనపై బుధవారం కనిపించిన సూర్యాస్తమయం దృశ్యం కనువిందు చేసింది. వంతెనకు ఇరువైపులా ఉన్న విద్యుత్తు దీపాల మధ్యలో కనిపించిన ఈ దృశ్యాన్ని తిలకించిన పలువురు నగరవాసులు తమ చరవాణుల్లో బంధించి ఆనందం వ్యక్తం చేశారు.
2/10
200.. ముంబయి తరఫున ఐపీఎల్లో రోహిత్ ఆడిన మ్యాచ్లు. ఆ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడింది అతనే. ఈ సందర్భంగా మ్యాచ్కు ముందు రోహిత్కు.. సచిన్ 200 నంబరుతో కూడిన ప్రత్యేక జెర్సీ, టోపీ బహుకరించాడు.
3/10
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. ఈ సందర్భంగా చాముండేశ్వరనాథ్, వెంకటపతి రాజు, రాహుల్ సంఘ్వీతో కలిసి సచిన్ ఇలా కనిపించాడు.
4/10
ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి బుధవారం నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగారు.
5/10
చెరువుల్లో, బావుల్లో నీళ్లు లేక పైర్లు సైతం ఎండి చేలల్లో నీటిచుక్క జాడలేక మర్కటాలు ఊర్లపై పడుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం మోతె మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందున్న నీళ్ల సంపు వద్ద కోతులు దాహం తీర్చుకున్న తీరును ‘న్యూస్టుడే’ క్లిక్మనిపించింది.
6/10
ఎండలు ముదురుతున్నాయి. భానుడి సెగ నుంచి జీవాలు కాపాడుకునేందుకు గొర్రెల కాపరులు నానా తంటాలు పడుతున్నారు. సీసీకుంట మండలం బండర్పల్లి వాగులో మిట్ట మధ్యాహ్నం వేళ గొర్రెలను నీటిలో ముంచుతూ ఒడ్డుకు పంపిస్తున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్ మనిపించింది.
7/10
బెంగళూరులో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాత మైసూరు బ్యాంకు కూడలిలో ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ ధర్నా చేస్తున్నఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడిచి పెట్టారు.
8/10
చెన్నై బెసంట్నగర్ సముద్రతీరానికి వచ్చిన అరుదైన తాబేలును జాలర్లు సురక్షితంగా సముద్రంలో వదిలారు. అంతరించిపోతున్న అరుదైన హాక్సిబిల్ తాబేలు అని, చెన్నైలో మొదటిసారిగా కనిపించిందని తాబేళ్ల పరిరక్షణ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
9/10
ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట డౌన్లో నివసిస్తున్న ఉపాధ్యాయుడు కుమారస్వామి ఇంటి ఆవరణలో ఓ సొర పాదు 5 అడుగుల కాయ కాసింది. తన ఇంటి పెరట్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తున్నారు.
10/10
ఎండలు తీవ్రరూపం దాల్చడంతో కృష్ణానదిలోని చిన్న చిన్న నీటి మడుగుల్లో నీరు తగ్గి చేపలు ఇలా చనిపోతున్నాయి. బుధవారం బీచుపల్లిలోని కృష్ణానదిలోని గుర్రంగడ్డ, నిజాంకొండ తదితర ప్రాంతాలలోని నీటి మడుగుల్లో చేపలు మృత్యువాత పడి కనిపించాయి.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..