క్రెడాయ్‌ హైదరాబాద్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) హైదరాబాద్‌ అధ్యక్షుడిగా వి.రాజశేఖర్‌రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా ఎన్‌.జైదీప్‌రెడ్డి ఎన్నికయ్యారు.

Published : 28 Oct 2023 03:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) హైదరాబాద్‌ అధ్యక్షుడిగా వి.రాజశేఖర్‌రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా ఎన్‌.జైదీప్‌రెడ్డి ఎన్నికయ్యారు. నలుగురు ఉపాధ్యక్షులుగా బి. ప్రదీప్‌రెడ్డి, సి.జి.మురళీమోహన్‌ గుప్తా, కె.రాంబాబు, ఎం.శ్రీకాంత్‌ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జగన్నాథరావు, కోశాధికారిగా మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌, సంయుక్త కార్యదర్శులుగా నితీష్‌రెడ్డి, క్రాంతికిరణ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా మురిషెట్టి శ్రీనివాస్‌ గుప్తా, సుశీల్‌ జైన్‌, మసునూరు శ్రీరామ్‌, వెంకట్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌ భన్సాల్‌, జైపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు వీరు పదవిలో ఉండనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని