సింహాచల చందనోత్సవం
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది.
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. సముద్రమట్టానికి 244 మీటర్ల ఎత్తున తూర్పు కనుమల్లో ప్రకృతి సౌందర్యానికి ఉనికిపట్టుగా ఈ కొండ విరాజిల్లుతోంది. ఆలయ నిర్మాణం క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దంలో జరిగి ఉండవచ్చని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కోణార్క్ ఆలయ నిర్మాత తూర్పు గాంగరాజు నరసింహదేవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి విరివిగా దానాలు చేసినట్టు ఆలయంలోని శాసనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం, రథయాత్ర, భక్త్యోత్సవం, చందనోత్సవం, ఉట్లవేడుక, గోదాకల్యాణం, తెప్పోత్సవం, డోలోత్సవం మొదలైన ఉత్సవాలు నిర్వహిస్తారు. చందనోత్సవం- భక్తుల్ని విశేషంగా ఆకర్షించే కార్యక్రమం. శ్రీమహావిష్ణువు వరాహరూపంలో హిరణ్యాక్షుణ్ని వధించాక నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ని సంహరించాడు. హిరణ్యకశిపుడి కుమారుడు పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడి కోరికపై స్వామి ఈ క్షేత్రంలో వెలశాడని, బ్రహ్మ సకల దేవతలతో తరలివచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని పురాణ గాథ.
వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అంటారు. ఆ రోజే సింహాద్రినాథుడి గంధం వొలుపు, నిజరూప దర్శనం, చందనోత్సవంగా ప్రసిద్ధి. పురూరవ చక్రవర్తి ఊర్వశితో గగనమార్గాన విహరిస్తుండగా ఒకచోట విమానం ఆగిపోయింది. స్వామి స్వప్నంలో పురూరవుడికి సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నట్టు తెలియజేశాడని, పురూరవుడు మట్టిని తొలగించి సహస్ర కలశ గంగధారతో పంచామృతాలతో స్వామిని అభిషేకించాడన్నది స్థలపురాణం. హిరణ్యకశిపుడి వధానంతరం ఉగ్రనరసింహుణ్ని చల్లబరచడానికి దేవతలు చందనం పూశారని ఒక కథనం. చందనోత్సవంనాడు మూడు మణుగుల చందనం, ఆ తరవాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగుల చొప్పున మొత్తం 12 మణుగుల చందనం సమర్పిస్తారు.
ఈ ఉత్సవానికి సంబంధించి జానపదుల గాథల్లో వేరే విశేషం కనిపిస్తోంది. సింహగిరి దగ్గర దుగ్గన పేరుగల బోయతెగకు చెందిన వ్యక్తి కొర్రలు జొన్నలు పండించేవాడు. స్వామికి అక్కడ అవతరించాలని సంకల్పం కలిగింది. వరాహ రూపంలో వెళ్ళి చేను మేస్తుండేవాడు. కొన్నాళ్లు చూసి దుగ్గన ఆ అడవిపందిని వెంటాడి శూలం విసిరాడు. నెత్తురోడుతూ అది ఒక పుట్టలో దూరింది. దుగ్గన అక్కడకు వెళ్ళి చూస్తే వరాహం సొమ్మసిల్లి పడిఉంది. జాలిపడి గంధం తెచ్చి పట్టువేశాడు. ఆ చల్లదనానికి వరాహం తేరుకొని తాను భగవంతుణ్నని ఆ పుట్టలో ఉంటానని చెప్పాడు. అది క్రమంగా పాలకుల వరకు వెళ్ళి ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. ఆ బోయడు పూర్వజన్మలో వాలి అని, రామావతారంలో వాలిని కొట్టినప్పుడు మరో అవతారంలో అతడి వల్ల దెబ్బతింటానని వరం ఇచ్చాడని, శ్రీరాముడే వరాహమని, వాలి దుగ్గనగా పుట్టాడని జానపదుల విశ్వాసం.
నరసింహస్వామి యోగమార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్యమండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్వానికి మూలాధారానికి విశ్వచైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మ తత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే వరాహ నారసింహ తత్త్వం.
డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విభూతి ధారణ
నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఐశ్వర్యం ఒకటి. ధన ధాన్యాదులు మాత్రమే ఐశ్వర్యం కాదు. వ్యక్తుల మనుగడ, ఉన్నతి, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు తదితరాలకు దోహదం చేసేవన్నీ ఐశ్వర్యాలే. ఐశ్వర్యాన్ని విభూతి అంటారు. ఇది రెండు రకాలు- భూతి, విభూతి అని. -
సత్యదేవ వైభవం
సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువైన అరుదైన క్షేత్రం- అన్నవరం. త్రిమూర్తుల ఏకీకృత మూర్తిమత్వంతో అన్నవరం సత్యనారాయణస్వామి అలరారుతున్నాడు. -
పోగొట్టుకున్న చోటే...
ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి- ‘తాతా, ఏం వెతుకుతున్నావు?’ అని అడిగాడు. -
రాకపోకలు
జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తుంటారు కవులు. రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుక అనీ, గమ్యస్థానాన్ని చేరే చోటును ముగింపు అనీ అందరూ వ్యవహరిస్తుంటారు. రైలు ప్రయాణ కాలం పరిమితం. -
గాన రామాయణం
భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడివడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాలగోపాలం విని, చదివి పరవశించే కథ- రామాయణం. -
దైవం ప్రసాదించిన దేహం
జీవిత సముద్రంలోని సుఖదుఃఖాలను ఈది, కాటికి కాళ్లు జాపుకొన్నవాళ్లకు సైతం మరణం వణుకు పుట్టిస్తుంది. చావు పుట్టుకలు మన చేతుల్లో లేనప్పుడు వగపెందుకు... దాని గురించి ఆలోచించకూడదు అంటారు జీవితాన్ని కాచి వడపోసిన పెద్దలు. పసితనం నుంచి పండు ముసలివరకు ఎవరు ఈ లోకం నుంచి నిష్క్రమించినా మనసు ద్రవించిపోతుంది. -
మన ప్రయాణం జ్ఞానం వైపు...
జ్ఞానం, విజ్ఞానం అనే మాటలు పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. -
కామరూపులు
రామాయణంలో శూర్పణఖ రాముణ్ని మోహించింది. ఆయన పొందు కోరింది. తన రాక్షస రూపాన్ని విడిచి అందాలరాశిగా మారింది. వయ్యారాలు వొలకబోసింది. మారీచుడు సీతమ్మను ఆకర్షించాలనుకొన్నాడు. -
పరమ పూజ్యులు ఆచార్యులు
భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాక, ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో ఆదిశంకరుని ఆవిర్భావం, ఆవిష్కారం అద్భుతాంశాలు. కేరళలోని కాలడిలో జన్మించి చిన్న వయసులోనే అపార జ్ఞాన సంపదతో, దేశమంతా ముమ్మార్లు పర్యటించిన ఆ మహానీయుడు గొప్ప వాఙ్మయాన్ని అందించడమే కాక, తాత్త్విక జగతిలో సుస్థిరమైన స్థానాన్ని అలంకరించారు. -
నిర్ణయాధికారం
ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు. -
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..