‘బ్లాక్ ఫంగస్’ మందుల కొనుగోలుకు యత్నాలు
బ్లాక్ ఫంగస్ బారినపడిన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన ఇంజక్షన్ల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి తక్షణం అవసరమైన యాంపోటెరిసిన్-బి
యాంపోటెరిసిన్ ఇంజక్షన్ల కోసం కసరత్తు
మందులు దొరక్క బాధితుల ఆవేదన
ఈనాడు-అమరావతి: బ్లాక్ ఫంగస్ బారినపడిన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన ఇంజక్షన్ల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి తక్షణం అవసరమైన యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్లు మార్కెట్లో లభించకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా కలత చెందుతున్నాయి. కొందరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వీటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంత ధరైనా చెల్లించి కొనేందుకు సిద్ధపడుతున్నా అవి లభించడం లేదు. అయితే యాంపోటెరిసిన్-బి 50ఎంజీ, 100 ఎంజీ ఇంజక్షన్లను 10వేలు చొప్పున కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రం సూచించిన రెండు సంస్థలతో ఇప్పటికే ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ చర్చలు జరిపింది. అదనంగా మరో కంపెనీతో కూడా మాట్లాడుతోంది. బ్లాక్ ఫంగస్ బారినపడిన రోగికి కనీసం 60 నుంచి 90 వరకు ఈ ఇంజక్షన్లను వాడాల్సి రావచ్చని చెబుతున్నారు. ఒక్కో ఇంజక్షన్ ధర రూ.5,900 నుంచి రూ.6,200 మధ్య ఉండవచ్చని తెలిసింది. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించింది. మరో వారంలో కొన్ని మందులు రాష్ట్రానికి రావచ్చని భావిస్తున్నారు.
ప్రభుత్వం ద్వారానే ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా
ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి కూడా వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే ఇంజక్షన్ల సరఫరా జరిగేలా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. కొవిడ్ బాధితుల్లో ఆరోగ్యం విషమించిన వారికి టోసిలిజుమాబ్ ఇంజక్షన్ ప్రస్తుతం ఏ విధంగా ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా జరుగుతుందో..అదే విధానాన్ని యాంపోటెరిస్-బి ఇంజక్షన్ల విషయంలోనూ అనుసరించాలని భావిస్తున్నారు. బాధితుల్లో అవసరమైన వారికి టోసిలిజుమాబ్ ఇంజక్షన్ ఇవ్వాలంటే సంబంధిత ఆసుపత్రి వైద్య నిపుణులు సిఫార్సు చేయాలి. దీనిని సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదిస్తేనే ఈ ఇంజక్షన్ రోగికి చేరుతుంది. అన్ని ఖర్చులు కలుపుకొని నిర్ధారించే ధరకు అనుగుణంగా ప్రైవేట్ ఆసుపత్రులు చెల్లించాలి.
పెరుగుతోన్న కేసులు...
బ్లాక్ ఫంగస్ బారినపడిన వారు క్రమంగా రాష్ట్రంలో పెరుగుతున్నారు. కృష్ణా జిల్లాలోనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి అధికారికంగా సుమారు 20 అనుమానిత కేసులు ఉన్నట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే విధంగా ఈ కేసులు బయటపడుతున్నాయి. అయితే ఈ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో లేనందున బాధితుల కుటుంబాలు వాటి కోసం అవస్థలు పడుతున్నాయి. ఇవి హైదరాబాదులోనూ దొరకడం కష్టంగా ఉంది.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘బ్లాక్ ఫంగస్’ చికిత్స
తక్షణం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు
ఈనాడు-అమరావతి: బ్లాక్ ఫంగస్తో బాధపడే వారికి అందించే చికిత్సను ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తెస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పోస్ట్-కొవిడ్ కింద అందించే ఈ చికిత్సను 14 రోజులపాటు ఆసుపత్రిలో ఉండి సిటీ, ఎమ్మారై, ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి వస్తే రూ.41,968 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ కోసం రూ.16,932 ఇస్తుంది. కంటికి సంబంధించిన మూడు రకాల శస్త్రచికిత్సలను అవసరాల మేరకు చేయాల్సి వస్తుంది. శస్త్రచికిత్స స్థాయి అనుసరించి రూ.27,810నుంచి రూ.50,000 మధ్య చెల్లింపులు ఉంటాయి. యాంపోటెరిసివ్-బి ఇంజక్షన్లను వాడితే వాటి బిల్లులను సమర్పిస్తే ఎంఆర్పీ ధర మేరకు చెల్లింపులు ఉంటాయి. ఇంజక్షన్ల ఫొటోలు, బార్కోడ్తో ఉన్న వయల్స్ను ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లులతోపాటు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్కు 13 బోధనాసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. వైద్య నిపుణులు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు వైద్యం చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి