‘బ్లాక్ ఫంగస్’ మందుల కొనుగోలుకు యత్నాలు
బ్లాక్ ఫంగస్ బారినపడిన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన ఇంజక్షన్ల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి తక్షణం అవసరమైన యాంపోటెరిసిన్-బి
యాంపోటెరిసిన్ ఇంజక్షన్ల కోసం కసరత్తు
మందులు దొరక్క బాధితుల ఆవేదన
ఈనాడు-అమరావతి: బ్లాక్ ఫంగస్ బారినపడిన వారికి చికిత్స చేసేందుకు అవసరమైన ఇంజక్షన్ల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడ్డ వారికి తక్షణం అవసరమైన యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్లు మార్కెట్లో లభించకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా కలత చెందుతున్నాయి. కొందరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వీటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంత ధరైనా చెల్లించి కొనేందుకు సిద్ధపడుతున్నా అవి లభించడం లేదు. అయితే యాంపోటెరిసిన్-బి 50ఎంజీ, 100 ఎంజీ ఇంజక్షన్లను 10వేలు చొప్పున కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రం సూచించిన రెండు సంస్థలతో ఇప్పటికే ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ చర్చలు జరిపింది. అదనంగా మరో కంపెనీతో కూడా మాట్లాడుతోంది. బ్లాక్ ఫంగస్ బారినపడిన రోగికి కనీసం 60 నుంచి 90 వరకు ఈ ఇంజక్షన్లను వాడాల్సి రావచ్చని చెబుతున్నారు. ఒక్కో ఇంజక్షన్ ధర రూ.5,900 నుంచి రూ.6,200 మధ్య ఉండవచ్చని తెలిసింది. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించింది. మరో వారంలో కొన్ని మందులు రాష్ట్రానికి రావచ్చని భావిస్తున్నారు.
ప్రభుత్వం ద్వారానే ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా
ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి కూడా వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే ఇంజక్షన్ల సరఫరా జరిగేలా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. కొవిడ్ బాధితుల్లో ఆరోగ్యం విషమించిన వారికి టోసిలిజుమాబ్ ఇంజక్షన్ ప్రస్తుతం ఏ విధంగా ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా జరుగుతుందో..అదే విధానాన్ని యాంపోటెరిస్-బి ఇంజక్షన్ల విషయంలోనూ అనుసరించాలని భావిస్తున్నారు. బాధితుల్లో అవసరమైన వారికి టోసిలిజుమాబ్ ఇంజక్షన్ ఇవ్వాలంటే సంబంధిత ఆసుపత్రి వైద్య నిపుణులు సిఫార్సు చేయాలి. దీనిని సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదిస్తేనే ఈ ఇంజక్షన్ రోగికి చేరుతుంది. అన్ని ఖర్చులు కలుపుకొని నిర్ధారించే ధరకు అనుగుణంగా ప్రైవేట్ ఆసుపత్రులు చెల్లించాలి.
పెరుగుతోన్న కేసులు...
బ్లాక్ ఫంగస్ బారినపడిన వారు క్రమంగా రాష్ట్రంలో పెరుగుతున్నారు. కృష్ణా జిల్లాలోనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి అధికారికంగా సుమారు 20 అనుమానిత కేసులు ఉన్నట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే విధంగా ఈ కేసులు బయటపడుతున్నాయి. అయితే ఈ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో లేనందున బాధితుల కుటుంబాలు వాటి కోసం అవస్థలు పడుతున్నాయి. ఇవి హైదరాబాదులోనూ దొరకడం కష్టంగా ఉంది.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘బ్లాక్ ఫంగస్’ చికిత్స
తక్షణం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు
ఈనాడు-అమరావతి: బ్లాక్ ఫంగస్తో బాధపడే వారికి అందించే చికిత్సను ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తెస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పోస్ట్-కొవిడ్ కింద అందించే ఈ చికిత్సను 14 రోజులపాటు ఆసుపత్రిలో ఉండి సిటీ, ఎమ్మారై, ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి వస్తే రూ.41,968 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ కోసం రూ.16,932 ఇస్తుంది. కంటికి సంబంధించిన మూడు రకాల శస్త్రచికిత్సలను అవసరాల మేరకు చేయాల్సి వస్తుంది. శస్త్రచికిత్స స్థాయి అనుసరించి రూ.27,810నుంచి రూ.50,000 మధ్య చెల్లింపులు ఉంటాయి. యాంపోటెరిసివ్-బి ఇంజక్షన్లను వాడితే వాటి బిల్లులను సమర్పిస్తే ఎంఆర్పీ ధర మేరకు చెల్లింపులు ఉంటాయి. ఇంజక్షన్ల ఫొటోలు, బార్కోడ్తో ఉన్న వయల్స్ను ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లులతోపాటు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్కు 13 బోధనాసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. వైద్య నిపుణులు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు వైద్యం చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా జయ బాడిగ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. -
శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. -
నాలుగు సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలు
రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
అనుమతుల పొడిగింపు రుసుములపై వివాదం
ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పొడిగింపు రుసుముల చెల్లింపుపై ఉన్నత విద్యామండలి, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల మధ్య వివాదం కొనసాగుతోంది. -
మాతృ మరణాల్లో సిజేరియన్ కేసులే అధికం
మాతృ మరణాల్లో సిజేరియన్ చేయించుకున్నవారు అధికసంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 362 మాతృ మరణాలు చోటుచేసుకున్నాయి. -
రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
ప్రాథమిక వివరాల ఆధారంగా పంటనష్టం జాబితాలు
కోతలు పూర్తయినా పొలంలో పంట ఉన్నప్పుడు తీసుకున్న నష్టం వివరాల ఆధారంగా పంటనష్టం గణన పూర్తిచేసి జాబితాలు తయారుచేస్తామని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. -
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన
తాము వెళ్లాల్సిన విమాన సర్వీసును రద్దుచేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. -
మంత్రి పెద్దిరెడ్డి అండతో నరేగా సంచాలకులుగా మరోసారి చినతాతయ్య
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) సంచాలకులు చినతాతయ్య పదవీకాలం ఈ నెలలో ముగియనుండగా.. మరో ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించింది. -
డాక్టర్ లోకేశ్ కేసు నమోదుకు అనుమతివ్వండి
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శాటిలైట్ ఫోన్తో వచ్చారన్న ఆరోపణలపై ప్రవాస వైద్యుడు డాక్టర్ ఉయ్యూరు లోకేశ్పై కేసు నమోదుకు అనుమతివ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు సోమవారం స్థానిక కోర్టును ఆశ్రయించారు. -
భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన సీఎస్
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
రాష్ట్రానికి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్