అప్పులు తెచ్చారు... ఆస్తులు పెంచలేదు
రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెచ్చిన రుణాల్లో 80 శాతం రెవెన్యూ వ్యయాలకే వెచ్చించడాన్ని కాగ్ తప్పుబట్టింది. దాని వల్ల ఆస్తుల కల్పన ప్రక్రియ కుంటుపడిందని
రుణాల్లో 80శాతం రెవెన్యూ ఖర్చులకే
వ్యయ నియంత్రణలో విఫలం
ఇలా అయితే భవిష్యత్తులో తలకుమించిన రుణభారం
ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన కాగ్
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెచ్చిన రుణాల్లో 80 శాతం రెవెన్యూ వ్యయాలకే వెచ్చించడాన్ని కాగ్ తప్పుబట్టింది. దాని వల్ల ఆస్తుల కల్పన ప్రక్రియ కుంటుపడిందని పేర్కొంది. భౌతిక, ఆర్థికపరమైన ఆస్తుల్ని సమకూర్చని ప్రభుత్వ ఖర్చులన్నీ రెవెన్యూ ఖర్చులుగా పరిగణిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల సాధారణ నిర్వహణ కోసం చేసే ఖర్చులు, సంక్షేమ పథకాలు, సేవలు, ప్రభుత్వం తీసుకున్న అప్పుల మీద వడ్డీల చెల్లింపులు వంటివి రెవెన్యూ ఖర్చుల్లోకి వస్తాయి. తెచ్చిన రుణాల్ని ఆస్తుల కల్పనకు బదులు, ఇలా రెవెన్యూ వ్యయాల కోసం ఎక్కువ వెచ్చించడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం తీర్చాల్సిన రుణ భారం బాగా పెరిగిపోతుందని కాగ్ ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలను పద్దుల్లో చూపకపోవడం వల్లే ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే ఉన్నట్లు కనిపిస్తున్నాయని, వాటినీ పరిగణనలోకి తీసుకుని ఉంటే నిర్దేశిత పరిధులను దాటేసి ఉండేవని తెలిపింది. ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంపై వాస్తవిక అంచనాలు రూపొందించుకోవడంలోనూ, రెవెన్యూ వ్యయ నియంత్రణలోనూ విఫలమైందని, అందుకే రెవెన్యూ లోటు గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2015-20 మధ్య రెవెన్యూ లోటు భర్తీకి రూ.22,112 కోట్లు ఇచ్చినప్పటికీ... రెవెన్యూ లోటుని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మొత్తం రెవెన్యూ రాబడుల్లో... రెవెన్యూ లోటు 2018-19లో 12.12 శాతం ఉండగా, 2019-20లో 23.81 శాతంగా నమోదైంది. 2018-19తో పోలిస్తే ఇది 90.24 శాతం పెరిగింది. 2019-20 బడ్జెట్ అంచనాల్లో ప్రభుత్వం రెవెన్యూ లోటుని రూ.1,779 కోట్లుగా చూపించగా, అది ఏకంగా రూ.26,441 కోట్లుగా నమోదైంది. అమ్మఒడి, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు, ప్రభుత్వ సొంత ఆదాయం రూ.1,511 కోట్లు తగ్గడం దీనికి కారణం’ అని కాగ్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు సంబంధించి కాగ్ తన నివేదికలో ప్రస్తావించిన కొన్ని ముఖ్యాంశాలు ఇవీ..!
ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించినా లక్ష్యాలకు దూరం..!
* రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టాలను 2020 డిసెంబరులో సవరించి, 2020 ఆగస్టు 30 నుంచి అమల్లోకి వచ్చేలా చేసింది. ఎఫ్ఆర్బీఎం చట్టంలో నిర్దేశించిన ద్రవ్య పరిమితుల అంచనాల్ని 2015-16 నుంచి 2019-20 వరకు కూడా వర్తించేలా మార్పులు చేసింది. అంత చేసినప్పటికీ ఎఫ్ఆర్బీఎం చట్టంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, 14వఆర్థిక సంఘం నివేదికలో నిర్దేశించిన లక్ష్యాల్ని చేరుకోలేకపోయాయి.
* రెవెన్యూ ఖర్చుల్ని మూలధన వ్యయంగా చూపడం, ప్రభుత్వ పద్దుల్లో ఇతర రుణాలను చూపకపోవడం వంటి సందర్భాలూ ఉన్నాయి. అవి సక్రమంగా చూపించి ఉంటే... రెవెన్యూ, ద్రవ్య లోటు మరింత పెరిగేవి.
* రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రభుత్వ సంస్థలు 2020 మార్చి నెలాఖరు నాటికి రూ.26,096.98 కోట్ల రుణాలు తీసుకున్నాయి. ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న ఈ రుణాలన్నీ బడ్జెటేతర రుణాల కేటగిరీలోకి వస్తాయి. అవన్నీ ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు కాకపోవడం వల్ల వాటిని ప్రజారుణం పరిధిలోకి తేలేదు. రాష్ట్ర ద్రవ్యలోటుని లెక్కించడంలోనూ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రజారుణం, ద్రవ్యలోటుని తక్కువ ఉన్నట్టు చూపించారు.
* మొత్తం బడ్జెటేతర రుణాల్ని లెక్కలోకి తీసుకుంటే ద్రవ్యలోటు జీఎస్డీపీలో 6.76 శాతంగా నమోదయ్యేది.
* 2019-20 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ గ్రాంట్లు, మైనర్ పనులకు సంబంధించిన రూ.1,007.14 కోట్లను, రెవెన్యూ ఖర్చులకు వినియోగించిన రూ.3,371.60 కోట్లనూ మూలధన పెట్టుబడుల కింద నమోదు చేయడం వల్ల రెవెన్యూ లోటుని రూ.4,379.34 కోట్లు మేర తక్కువ చేసి చూపినట్లైంది. వాస్తవ లెక్కల ప్రకారం చూస్తే జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.17 శాతంగా నమోదవ్వాల్సి ఉండగా, 2.72 శాతంగా చూపించారు.
* 2016-17, 2019-20లో రాష్ట్ర రెవెన్యూ లోటు 2020లో సవరించిన ఎఫ్ఆర్బీఎం చట్టంలో నిర్దేశించిన లక్ష్యాల కంటే ఎక్కువగా ఉంది. ద్రవ్యలోటు, చెల్లించాల్సిన పాత బకాయిలు ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోనే ఉండటానికి కారణం... సవరించిన చట్టం వెనుకటి సంవత్సరాల నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడమే కారణం.
* రాష్ట్ర ప్రభుత్వ రుణ బకాయిలు 2015-20లో రూ.1,73,854 కోట్లు ఉంటే, 2019-20కి రూ.3,01,802 కోట్లకు (73.60 శాతం వృద్ధి) చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM