కొవిడ్ పరీక్షలను పెంచరా?
కొవిడ్ కేసులకు తగ్గట్టు నమూనాల పరీక్షలు పెరగడంలేదు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న విశాఖ, చిత్తూరు జిల్లాల్లోనూ నమూనాల పరీక్షలు పరిమితంగానే జరుగుతున్నాయి. ఈనెల 13 నుంచి ప్రతిరోజూ రాష్ట్రంలో 30 నుంచి 35 వేల వరకు మాత్రమే
కేసులు పెరుగుతున్నా నిర్లక్ష్యమేనా?
ప్రైవేట్లో అధిక రుసుముల వసూళ్లు
‘ఒమిక్రాన్’ పేరిట అదనపు మోత
కొవిడ్ కేసులకు తగ్గట్టు నమూనాల పరీక్షలు పెరగడంలేదు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న విశాఖ, చిత్తూరు జిల్లాల్లోనూ నమూనాల పరీక్షలు పరిమితంగానే జరుగుతున్నాయి. ఈనెల 13 నుంచి ప్రతిరోజూ రాష్ట్రంలో 30 నుంచి 35 వేల వరకు మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ లక్ష నుంచి 1.20 లక్షల వరకు పరీక్షలు చేసే సామర్థ్యం వైద్య ఆరోగ్య శాఖకు ఉంది. తొలి, మలివిడత కొవిడ్లో కొత్త కేసు బయటపడగానే... వారితో సన్నిహితంగా మెలిగిన ప్రథమ, ద్వితీయ వ్యక్తులను గుర్తించి వారికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఫలితంగా వైరస్ వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఏర్పడింది. పట్టణాలు, గ్రామాల్లోనూ పరీక్షల కేంద్రాలు అనుకున్నట్లుగా కనిపించడం లేదు. విజయవాడ వరకు చూస్తే తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఎన్టీఆర్ స్టేడియంలో మాత్రమే నమూనాలను సేకరిస్తున్నారు. సచివాలయాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సౌకర్యం ఉన్నట్లు కృష్ణా జిల్లా అధికారులు చెబుతున్నా... పూర్తిస్థాయిలో అమలవడంలేదు.
‘మ్యూటెంట్’ ఏదో చెప్పడానికి రూ.800
బాధితులు ప్రైవేటుగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు అధికంగా చేసుకుంటున్నారు. ఒక్కో దానికి రూ.475 మాత్రమే తీసుకోవాల్సి ఉన్నా... రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే... సోకింది ‘ఒమిక్రాన్’ వేరియంటా? కాదా? అని చెప్పడానికి అదనంగా రూ.800 చెల్లించాలని విజయవాడలో ఓ ప్రైవేట్ ల్యాబు వారు ప్రచారం చేయడం గమనార్హం. రాష్ట్రంలో 40 ప్రైవేటు ల్యాబుల్లో ఆర్టీపీసీఆర్ చేసేందుకు అవకాశముంది. వీటిలో చేసే ప్రతి పరీక్షకూ అధికారికంగా నమోదు చేయాల్సి ఉన్నా... పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఆచరణలో జరగడంలేదు. ఫలితంగా అనధికారిక కొవిడ్ కేసులు అధికంగానే ఉంటున్నాయి.
వ్యాక్సినేషన్పైనే అధిక దృష్టి
వ్యాక్సినేషన్పై దృష్టి నిలిపిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది నమూనాల సేకరణకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఈసారి పట్టణాలు/నగరాలు, గ్రామాలన్న తేడా లేకుండా వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. కొవిడ్ బాధితుల్లో లక్షణాలు తక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో నిర్ధారణ పరీక్షల ప్రాధాన్యాన్ని అధికారులు విస్మరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.
‘జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలి’
‘కొవిడ్ ప్రభావానికి అనుగుణంగా జిల్లా అధికారులే నమూనాల పరీక్షలు ఏస్థాయిలో చేయాలన్న దానిపై నిర్ణయాలు తీసుకోవాలి. వైద్యారోగ్య శాఖ ద్వారా సౌకర్యాలు కల్పించడం వరకే రాష్ట్రస్థాయిలో చూస్తాం. గతంలో నిర్ణయించిన ప్రకారం... హిందూపురం, గుంతకల్, మదనపల్లె, రాజమహేంద్రవరం, అమలాపురం, తెనాలి, నరసరావుపేట, ప్రొద్దుటూరు, మచిలీపట్నం, నంద్యాల, ఆదోని, గూడూరు, మార్కాపురం, కందుకూరు, టెక్కలి, అనకాపల్లి, నర్సీపట్నం, పార్వతీపురం, జంగారెడ్డిగూడెంలలో వీఆర్డీఎల్ ల్యాబులను త్వరలో అందుబాటులోకి తెస్తాం’ అని సీనియర్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు.
- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్