భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు.
రైతులకు రూ.9,830 కోట్ల ఎగనామం
వ్యవసాయ రాయితీ పథకాలనూ ఎత్తేసిన ఘనుడు జగన్
ఐదేళ్ల పాలనలో అడుగడుగునా దగా
ఈనాడు, అమరావతి
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు.
రైతు భరోసా కింద ఏపీలో ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి ఇచ్చింది రూ.7,500. ఐదెకరాలున్నా వచ్చింది రూ.7,500 మాత్రమే. అంటే ఐదేళ్లలో అందింది రూ.37,500 మాత్రమే.
రెండింటిలో ఏది గొప్ప... జగన్ మాత్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు సాయం చేస్తున్నామంటారు. చెప్పేది అబద్ధమే అని తెలిసినా... దాన్ని పదేపదే వల్లెవేయడం ద్వారా రైతుల్ని నమ్మించడంలో ఆయన ఎంత నేర్పరో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ?
రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని జగన్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఐదేళ్లలో రూ.37,500 మాత్రమే ఇచ్చారు. పంట వేయడానికి ముందే మే నెలలో రైతు ఖాతాలో ఒకేసారి రూ.12,500 జమ చేస్తామని చెప్పిన జగన్... దాన్ని రూ.7,500 తగ్గించారు. అంటే ఇస్తామన్న రూ.50 వేలలో రూ.12,500 కోత పెట్టారు. ఇది నమ్మిన రైతులకు ద్రోహం చేయడం కాదా?
ఆయన చెప్పే మరో పచ్చి అబద్ధమేంటో తెలుసా? రైతు భరోసా రూపంలో వైకాపా సర్కారు ఇచ్చే రూ.7,500 మొత్తంతో అన్నదాతల ఖర్చులన్నీ తీరిపోతాయట. అందుకే పంట నష్టపోయినా వారికి వచ్చే ఇబ్బంది ఏముంటుందని అన్నదాతలను చులకన చేసి మాట్లాడటమూ ఆయనకే చెల్లుతుందేమో?
అది చాలదన్నట్లు రైతులకు అయ్యే మొత్తం పెట్టుబడి ఖర్చులో 80% తామే భరిస్తున్నామంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అధికారం కోసం ఇలా పచ్చి అబద్ధాలు చెప్పాలా? రూ.7,500 íట్టుబడితో ఎన్ని ఎకరాలు సాగవుతుంది?
తీవ్ర కరవొస్తే దెబ్బతిన్న పంటల పరిశీలనకూ వెళ్లని పాలకుడు... తుపాను అతలాకుతలం చేస్తే కార్పెట్లు వేసుకుని వెళ్లి అంటీ ముట్టనట్లు వ్యవహరించిన సీఎం.. దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగనే. తాను రైతు బిడ్డనని, తమది రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పే ఆయన.. ఐదేళ్ల పాలనలో రైతు భరోసా రూపంలో అన్నదాతలకు ఎగ్గొట్టిందెంతో తెలుసా? ఏకంగా రూ.9,830 కోట్లు. ఒక్కో రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.12,500 ఎగ్గొట్టారు. అయినా వారిని ఎంతో ఉద్ధరిస్తున్నామని, ఇతర పథకాలెందుకనే భావనతో గతంలో ఉన్న రాయితీ పథకాలను ఎత్తేశారు. సమస్యలన్నింటికీ రైతు భరోసా ఒక్కటే మందు అన్నట్లుగా వారిని నిలువెల్లా వంచించారు. ఐదేళ్లుగా వర్షాలు, వరదలు, కరవులతో వ్యవసాయంలో సంక్షోభం నెలకొన్నా... రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఎంతమాత్రం పట్టించుకోలేదు. వరి సహా ఇతర పంటల సాగు ఏటికేడు తగ్గిపోతున్నా.. ఉత్పత్తి పెరుగుతోందంటూ భుజాలు చరచుకుంటున్నారు.
జగన్ వచ్చాకే వ్యవసాయం మొదలైనట్లు కలరింగ్
గతంలో రాష్ట్రంలో వ్యవసాయమే లేదని, తామొచ్చాకే ఆంధ్రప్రదేశ్లో రైతులకు వ్యవసాయ పాఠాలు మొదలు పెట్టినట్లు జగన్ ప్రభుత్వం చెబుతోంది. 10,778 రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ఏర్పాటు చేసి రైతుల చేయిపట్టుకుని నడిపిస్తున్నామంటూ అదేపనిగా బాకాలూదుతోంది. ఆర్బీకేల్లో ఏడు వేల మందికి పైగా సిబ్బంది కొరత ఉంది. వాటికి భవనాల్లేవు, మౌలిక వసతుల్లేక సిబ్బంది అల్లాడుతున్నారు. రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ సలహాలు, సూచనలు అందించాల్సిన బాధ్యత వారిది. అయితే వ్యవసాయంలో కీలకమైన విస్తరణను గాలికొదిలేశారు. అక్కడ వారిచేత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మిస్తున్నారు.
నిధుల విడుదలలో కొత్త ఎత్తుగడ
ఏ ప్రభుత్వమైనా పంటల బీమా, సున్నా వడ్డీ, రాయితీలను పాలనలో భాగంగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటుంది. కానీ, తరచూ వాటికోసం ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి విడుదల చేసిన సందర్భాలు లేవు. వైకాపా పాలనలో కొత్త ఎత్తుగడ మొదలైంది. పథకాలకు నిధులను విడుదల చేసే కార్యక్రమం పేరిట ఏడాదికోసారి హంగామా చేస్తున్నారు. రైతులకు కలిగే మేలు పావలా అయితే ప్రచారం మాత్రం ముప్పావలా తీరున ఉంటోంది.
తెదేపా హయాంలో రూ.50 వేల రుణాలకు ఒకేసారి మాఫీ
తెదేపా హయాంలో రుణమాఫీ అమలులో భాగంగా రైతులకు రూ.15,148 కోట్లు ఇచ్చారు. రూ.50వేల లోపు ఉన్న లక్షల మంది పంట రుణాలను ఒకేసారి రద్దుచేశారు. 2.23 లక్షల మంది ఉద్యాన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున ఒకేసారి రూ.50వేల వరకున్న రుణాల్ని రద్దు చేశారు. దీనికి రూ.385 కోట్లు ఇచ్చారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద 2018-19లో రూ.2వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
- ఏడాదికి రూ.80 కోట్ల విలువైన సూక్ష్మపోషకాలను అందించారు. దీనితో రైతులకు దిగుబడులు పెరిగాయని, అదనపు ఆదాయం లభించిందని అధ్యయనాల్లో వెల్లడైంది. జగన్ వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు.
- వ్యక్తిగత యాంత్రీకరణ కింద టార్పాలిన్లు, పిచికారీ యంత్రాలు, ఇతర వ్యవసాయ ఉపకరణాలను రాయితీపై ఇచ్చారు. వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతింటున్నా... టార్పాలిన్లు కూడా ఇవ్వకుండా వైకాపా సర్కారు కళ్లు మూసుకుంది. రైతుల్ని వానలు, వరదలకు వదిలేసింది.
- గతంలో సున్నా వడ్డీతోపాటు పావలా వడ్డీ పథకాలను అమలు చేశారు.
పీఎం కిసాన్ సొమ్మునూ ఖాతాలో వేసుకుని..
రైతుభరోసా కింద ఇచ్చే సాయం దేశంలో మరెక్కడా ఇవ్వడం లేదని జగన్ చేసే ప్రచారమంతా అసత్యమే. ఐదేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.7,500 మాత్రమే ఇచ్చారు. కానీ, రూ.13,500 ఇస్తున్నామంటూ కేంద్రం అందించే పీఎం కిసాన్ సొమ్మునూ తన ఖాతాలో కలిపేశారు. ఐదేళ్లలో ఆయనిచ్చింది రూ.19,170 కోట్లే. హామీకి అనుగుణంగా రూ.29 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే... అందులో రూ.9,830 కోట్లు ఎగ్గొట్టారు. అదే తెలంగాణలో ఏడాదికి రూ.14,800 కోట్ల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేశారు. జగన్ మాత్రం వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలను కుదించి, రాయితీ ఎత్తేయడం ద్వారా అన్నదాతలకు రూ.5వేల కోట్లకు పైగా కోత పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం