నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు.
పట్టణాలకు ప్రభుత్వం తెచ్చిన కష్టం
తప్పుడు నివేదికలు, కాకి లెక్కలతో వైకాపా సర్కారు కాలయాపన
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నిధులకూ మంగళం
45 పుర, నగరపాలక సంస్థల్లో తీవ్ర కొరత
అనేక చోట్ల ఐదారు రోజులకోసారి తాగునీటి సరఫరా
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. నగర శివారు నేతాజీకాలనీ, ఇందిరాకాలనీ, తీర్లమాన్యం... ఇలా అనేక కాలనీల్లో ఇదే పరిస్థితి.
చిత్తూరు జిల్లా పలమనేరులో తాగునీరు ఎన్ని రోజులకోసారి సరఫరా చేస్తున్నారో తెలుసా? ఆరు రోజులకోసారి. సమస్యపై అరిచి గీపెట్టినా ఎవరికీ పట్టదు. అత్యవసరం అనుకుంటే ప్రైవేట్ ఆర్వో ప్ల్లాంట్లకు వెళ్లి నీరు కొనుక్కోవాలని ఉచిత సలహాలిస్తారు. పలమనేరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే ప్రతిపాదనలను జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది. రూ.25 కోట్లు ఇవ్వడానికీ సీఎంకు మనసొప్పలేదు.
ఈనాడు, అమరావతి: బిందెడు నీళ్లివ్వండి మహాప్రభో అంటూ పట్టణ ప్రజలు ఆక్రందనలు చేస్తున్నారు. ఐదారు రోజులకోసారి సరఫరా చేస్తున్న అరకొర తాగునీరు సరిపోక అవస్థలు పడుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికల్లేని జగన్ ప్రభుత్వ అసమర్థత కారణంగా గొంతు తడుపుకోవడమే గగనమైంది.
45 పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నా... తప్పుడు నివేదికలు, కాకిలెక్కలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. సర్కారు దృష్టిలో 32 పట్టణాల్లోనే నీటి కొరత. అదీ చెప్పుకోదగ్గ సమస్య కాదట. ప్రజలకు రక్షిత నీరు అందించడాన్ని కనీస బాధ్యతగా గుర్తించలేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదు. బిందెడు నీటి కోసం రోడ్లపైకి వచ్చి మహిళలు చేస్తున్న ఆందోళనలు జగన్కు కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందించకపోగా... నిధులన్నీ తన చేతుల్లో పెట్టుకుని పట్టణ స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు. వేసవిలో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఉద్దేశించిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల గ్రాంట్లు నిలిపివేశారు. తెదేపా ప్రభుత్వంలో రూ.2 వేల కోట్లతో ప్రారంభించిన తాగునీటి పథకాల పనులకు నిధులివ్వకుండా జగన్ అటకెక్కించారు. సమస్యలపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం తప్పితే ప్రజల గొంతు తడపాలన్న ఆలోచన చేయలేదు. గత ఐదేళ్లలో పురపాలక శాఖకు ఇద్దరు మంత్రులు మారినా ప్రజా సమస్యలు పట్టలేదు. తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీరందించే ప్రయత్నమూ చేయలేదు. నిన్నటి వరకు సీఎం, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి చేస్తున్న సమీక్షల ద్వారా ఎలాంటి ఉపయోగమూ లేదు.
కాకి లెక్కలు... ప్రజలకు చుక్కలు
రాష్ట్రంలోని ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో పట్టణ ప్రజలకు ఐదారు రోజులకోసారి తాగునీరు అందించడమూ కష్టమవుతోంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, పొదిలి, మార్కాపురం, కనిగిరి పట్టణాల్లో సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఆరు రోజులకోసారి తాగు నీరు సరఫరా చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అత్యంత అధ్వానంగా ఉన్నా... సమస్య తీవ్రంగా ఉన్న పట్టణాల సంఖ్య ఏడుకు మించి లేవంటూ తప్పుడు నివేదికలు రూపొందిస్తున్నారు. బద్వేల్, బొబ్బిలి, మాచర్ల, మదనపల్లె, నందిగామ, నంద్యాల, రాయచోటి, విజయనగరం పుర, నగరపాలక సంస్థల్లో నాలుగైదు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నా... ప్రభుత్వం దృష్టిలో అక్కడ రెండు రోజులకోసారి నీరు ప్రజలకు పుష్కలంగా అందుతోందట. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో 45 చోట్ల తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైంది. ప్రకాశం జిల్లా పొదిలి ప్రజలు తాగునీటి కోసం రోజూ రూ.లక్షకుపైగా వెచ్చిస్తున్నారు. ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లలో 20 లీటర్ల నీటిని రూ.20 చొప్పున కొంటున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రజలు రోజూ రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
నివేదికలే... ఐదేళ్లుగా నిధుల్లేవు
వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఐదేళ్లుగా పట్టణ స్థానిక సంస్థలకు నిధులివ్వడం లేదు. ఏటా వేసవికి ముందు పుర, నగరపాలక సంస్థలకు అవసరమైన నిధులపై కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. వీటిపై సమీక్షించి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కింద నిధులు కేటాయిస్తుంటారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ విధానం తు.చ. తప్పక అమలైంది. వైకాపా ప్రభుత్వంలో పట్టణ స్థానిక సంస్థలకు ఒక్క రూపాయైనా రాలేదు. ఐదేళ్లలో రూ.350 కోట్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా సమీక్షలకే పరిమితం చేశారు. దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసే గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేక పోతున్నారు. ఇతర అత్యవసర సమయాల్లో చేపట్టిన పనులకూ సంబంధించి రూ.25 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. నిధుల కొరతతో ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ ఏడాది వేసవిలో ట్యాంకర్లతో నీటి సరఫరా నిలిపివేశారు. మార్కాపురం, కనిగిరిలోనూ అరకొరగా సరఫరా చేస్తున్నారు.
పురపాలిక నిధులివ్వడానికీ చేతులు రావడం లేదు
తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెబుతున్న ప్రభుత్వానికి పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో నిధులివ్వడానికీ చేతులు రావడం లేదు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు పాడవడం, పైపులైన్లు పగిలిపోవడం వంటివి చోటుచేసుకోవడం సహజం. వీటికి అత్యవసరంగా మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలంటే నిధులు అందుబాటులో ఉండాలి. పనులు పూర్తి చేసి సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసినా ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు. అత్యవసర పనులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు రూ.250 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో పనుల నిర్వహణకు గుత్తేదారులు వెనక్కు తగ్గుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ