Exit Polls: కమల కాంతులే!
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాల్లో భాజపా ఆధిపత్యం చెలాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి! అత్యంత కీలకమైన ఉత్తర్ప్రదేశ్తో పాటు మణిపుర్లో ఆ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్
ఉత్తర్ప్రదేశ్లో మళ్లీ భాజపాదే అధికారం
పంజాబ్లో ఆప్ పాగా
మణిపుర్లో కాషాయ దళానికే మొగ్గు
ఉత్తరాఖండ్లో భాజపా, కాంగ్రెస్ హోరాహోరీ
గోవాలో హంగ్ తలెత్తే అవకాశం
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాల్లో భాజపా ఆధిపత్యం చెలాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి! అత్యంత కీలకమైన ఉత్తర్ప్రదేశ్తో పాటు మణిపుర్లో ఆ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో అంచనా వేశాయి. ఉత్తరాఖండ్లోనూ ఆ పార్టీకి విజయావకాశాలు మెండుగానే ఉన్నట్లు తెలిపాయి. గోవాలో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరుతో హంగ్ తలెత్తే అవకాశాలున్నట్లు వెల్లడించాయి. మరో కీలక రాష్ట్రం పంజాబ్లో కాంగ్రెస్కు షాకిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని కైవసం చేసుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. యూపీలో ఏడో విడత పోలింగ్ సోమవారం ముగిసిన వెంటనే.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాలను ఈ నెల 10న ప్రకటించనున్నారు.
యూపీ: కమల దరహాసం
ఉత్తర్ప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడటం దాదాపుగా లాంఛనమే! అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి గట్టిగానే ప్రయత్నించినప్పటికీ.. మెజార్టీ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోనుంది. బీఎస్పీ మూడో స్థానంతో, కాంగ్రెస్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోనున్నాయి.
పంజాబ్: ఆప్ అదుర్స్
రాష్ట్రంలో ఓటర్లు మార్పు కోరుకున్నారు! కాంగ్రెస్కు గట్టి షాకిస్తూ.. ఆప్ వైపు మొగ్గారు. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం దాదాపు ఖాయం! ఈ ఫలితంతో ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ విస్తరణకు గట్టి ఆదరువు దొరికినట్లవనుంది. రాష్ట్రంలో ప్రధానంగా అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్కు ప్రతికూలంగా పరిణమించాయి.
ఉత్తరాఖండ్: భాజపా-కాంగ్రెస్.. నువ్వా నేనా
రాష్ట్రంలో ఈ దఫా భాజపా, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. ఇరు పార్టీల మధ్య విజయం దోబూచులాడుతోంది. అయితే- రెండింటిలో కమలదళానిదే కాస్త ముందంజ అన్న సంకేతాలున్నాయి.
మణిపుర్: భాజపాదే పీఠం!
రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం నాటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిల్చినప్పటికీ, సరైన సమయంలో చక్రం తిప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన భాజపా.. ఈ దఫా సొంతంగా అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏకైక అతిపెద్ద పార్టీగా అది అవతరించడం ఖాయం! కాంగ్రెస్ చాలా దూరంగా రెండో స్థానంలో నిలవనుంది.
గోవా: హంగ్ దిశగా..
ఎప్పట్లాగే గోవాలో హంగ్ తలెత్తే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్లు మెజార్టీ మార్కుకు కాస్త దూరంలో ఆగిపోతాయని అంచనా. తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కొన్ని సీట్లు దక్కించుకొని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!