అప్పులకు తలుపులు మరింత బార్లా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులకు తలుపులు మరింత బార్లా తెరిచింది. ఆర్థిక నిర్వహణ తీరు, అప్పులు సమీకరిస్తున్న తీరు సరిగా లేదని... ఇలాగే వ్యవహరిస్తే ఆర్థిక అస్థిరత తప్పదంటూ
రుణాలకు గ్యారంటీ పరిమితిని రెట్టింపు చేసిన రాష్ట్రం
జీఎస్డీపీలో 0.5 శాతమే గ్యారంటీలకు అవకాశం
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంటున్న నిపుణులు
అప్పులపై కాగ్ హెచ్చరించిన రోజునే ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులకు తలుపులు మరింత బార్లా తెరిచింది. ఆర్థిక నిర్వహణ తీరు, అప్పులు సమీకరిస్తున్న తీరు సరిగా లేదని... ఇలాగే వ్యవహరిస్తే ఆర్థిక అస్థిరత తప్పదంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన రోజే అప్పులకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల పరిమితిని రెట్టింపు చేసింది. మరింత అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణలు చేసింది. ఈ పరిణామంతో నిపుణులు విస్తుపోతున్నారు. ఈ మధ్యే ఆర్ఈసీ, పీఎఫ్సీ ప్రతినిధులు తామిచ్చిన రుణాల వసూలుకు నేరుగా రాజధానికి వచ్చి ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ప్రభుత్వ కంపెనీ రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే అది దేశ విద్యుత్తు రంగంపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని సైతం ఆర్ఈసీ ఛైర్మన్ సైతం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలాంటి తరుణంలో ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణలు చేస్తూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం సభలో బిల్లు పెట్టారు. ఆ వెంటనే ఆమోదం పొందింది. ఈ చట్టం నాలుగో భాగంలో ‘డి’ క్లాజును మార్చారు. 2005 చట్టంలో ‘90%’ అని ఉన్నచోట ‘180%’ అని మారుస్తున్నట్లు ప్రతిపాదించారు. దానికి సభ ఆమోదం తీసుకున్నారు. ఈ చట్ట సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా అప్పులు తీసుకునే వెసులుబాటు లభించింది. ఇంతకుముందు కార్పొరేషన్లు అప్పులు తీసుకునేందుకు గ్యారంటీలు ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేసుకుంది. ఉదాహరణకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు లక్ష కోట్లు ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీల మొత్తం అందులో 90%.. అంటే రూ.90 వేల కోట్ల వరకు ఉండొచ్చు. తాజా సవరణతో ఆ గ్యారంటీల పరిమితిని రూ.1.80 లక్షల కోట్లకు పెంచారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు రూ.25వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. తన గ్యారంటీ పరిమితి దాటిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందంటూ వివాదమైన విషయం తెలిసిందే. తాము గ్యారంటీలు ఇచ్చామే తప్ప ఆ గ్యారంటీలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోలేదంటూ ప్రభుత్వం ఒక వాదన వినిపించింది. కేంద్ర ఆర్థిక వ్యయవిభాగం కూడా ఈ అంశాన్ని తప్పుపట్టింది.
కేంద్ర చట్టమే వేరన్న నిపుణులు
రాష్ట్రప్రభుత్వం రెవెన్యూ రాబడిలో 90% గ్యారంటీ ఇచ్చే విధానాన్ని 2005 నుంచి అనుసరిస్తున్నా కేంద్ర మార్గదర్శకాలు పూర్తిగా వేరని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఈ గ్యారంటీలపై 2010లో కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.5%కు మించకుండా మాత్రమే ప్రభుత్వం ఇలాంటి గ్యారంటీలు ఇవ్వాలని చెబుతున్నారు. ఆ లెక్కన ఏపీ ప్రభుత్వం సుమారు రూ.5,300 కోట్లకు మించి గ్యారంటీ ఇచ్చే అవకాశమే లేదనేది కొందరు నిపుణుల వాదన. పోనీ రాష్ట్రప్రభుత్వం ఈ మార్గదర్శకాలు పట్టించుకోకుండా తన పాత 2005 చట్టాన్ని అనుసరిస్తోందనుకున్నా ఇప్పుడు తన రుణ గ్యారంటీ పరిమితిని రెట్టింపు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చినా, వాటిలో చాలా సంస్థలు వ్యాపారాలు చేయట్లేదు. దాంతో ఆదాయం రావట్లేదు. అవి స్వయంగా ఆ రుణాలు తీర్చలేవు. ఆ అప్పులు తీర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించవలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రాబోయేరోజుల్లో ఈ అప్పుల భారం ఏ స్థాయికి చేరుతుంది? ఎలా తీర్చగలరన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్