పంచింది అరకొరే..!
పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో నిధులు సమకూరుతున్నా రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది నామమాత్రంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపిన వివరాల ప్రకారం ఒక్క 2020-21 ఆర్థిక సంత్సరంలోనే ఈ రెండు ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం ద్వారా
కేంద్రానికి వచ్చిన ఆదాయం రూ.3.72 లక్షల కోట్లు
రాష్ట్రాలన్నిటికీ ఇచ్చింది రూ.20 వేల కోట్లే
పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుంకాల ద్వారా సమకూరిన మొత్తాల్లో పంపిణీ తీరిది..
దిల్లీ: పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో నిధులు సమకూరుతున్నా రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది నామమాత్రంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపిన వివరాల ప్రకారం ఒక్క 2020-21 ఆర్థిక సంత్సరంలోనే ఈ రెండు ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.3.72 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మొత్తం నుంచి రాష్ట్రాలన్నిటికీ కలిపి రూ.19,972 కోట్లను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు గత ఐదేళ్లలో ఇంధనాలపై వ్యాట్ ద్వారా రాష్ట్రాలన్నీ రూ.9.57 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాల రూపంలో రూ.12.10 కోట్లు వసూలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
* పెట్రోలు, డీజిలుపై విధించిన సుంకాల వల్ల 2019-2020లో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.1.78 లక్షల కోట్లు కాగా ఆ మరుసటి ఏడాది(2020 ఏప్రిల్-2021మార్చి) ఈ మొత్తం రూ.3.72 లక్షల కోట్లు కావడం గమనార్హం. అంటే ఏడాదిలో సుంకాల ఆదాయం రెట్టింపునకు పైగానే పెరిగింది. పన్నుల భారాన్ని పెంచడం వల్లే ఈ పెరుగుదల సాధ్యమైందని స్పష్టమవుతోంది. 2016-17లో రూ.2.22లక్షల కోట్లు, 2017-18లో రూ.2.25లక్షల కోట్లు, 2018-19లో రూ.2.13లక్షల కోట్లు ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రానికి సమకూరాయి.
* ఎక్సైజ్ సుంకాల రూపంలో వసూలై మొత్తం నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటాలను కేటాయించడం లేదు. కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా సమకూరిన మొత్తాన్ని...ఆర్థిక సంఘం నిర్ణయించిన ఫార్ములా ప్రకారం అందజేస్తుంది. దీని వల్ల కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరినా రాష్ట్రాలకు దక్కే వాటా చాలా స్వల్పంగా ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు