జోరు తగ్గని కరోనా
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి ఆగడం లేదు. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,82,970 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ బాధితులు 8,961. క్రియాశీల కేసుల్లోనూ(18,31,000) భారీ పెరుగుదలే కనిపిస్తోంది.
24 గంటల్లో 2,82,970 కొత్త కేసులు
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి ఆగడం లేదు. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,82,970 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ బాధితులు 8,961. క్రియాశీల కేసుల్లోనూ(18,31,000) భారీ పెరుగుదలే కనిపిస్తోంది. వైరస్తో 441 మంది మృత్యువాత పడగా, అందులో అత్యధికం(122) కేరళ వాసులే, తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (53), పశ్చిమ బెంగాల్ (34) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్తో మరణించిన వారి సంఖ్య 4,87,202కు, మొత్తం కేసుల సంఖ్య 3,79,01,241కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు ప్రమాదకర స్థాయి(15.63%) లోనే ఉంటోంది.
* మసూరిలోని లాల్ బహాదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో శిక్షణ పొందుతున్న 84 మంది ఐఏఎస్లకు కొవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్గా తేలింది.
విమానాలపై నిషేధం పొడిగింపు: డీజీసీఏ
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక ఒప్పందం చేసుకున్న 40 దేశాలకు మాత్రం ఎప్పట్లానే విమాన రాకపోకలు కొనసాగుతాయి. కార్గో సర్వీసులకు నిషేధం వర్తించదు.
భారత్లో 23న పతాక స్థాయి
కాన్పుర్ ఐఐటీ శాస్త్రవేత్త మణీంద్ర అంచనా
దిల్లీ: భారత్లో కొవిడ్-19 మూడో ఉద్ధృతి ఈ నెల 23న పతాక స్థాయికి చేరుతుందని కాన్పుర్ ఐఐటీ శాస్త్రవేత్త మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. ఆ దశలోనూ రోజువారీ కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షల కన్నా తక్కువే ఉండొచ్చని అంచనావేశారు. దేశంలో కొవిడ్ కేసుల తీరుతెన్నులను పరిశీలించడంతోపాటు వాటిపై అంచనాలు కట్టేందుకు ఉద్దేశించిన ‘సూత్ర నమూనా’ రూపకర్తల్లో అగర్వాల్ కూడా ఉన్నారు. ఆయన తాజా అంచనాల ప్రకారం..
* ఈ వారం మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్లలో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడులో వచ్చేవారం ఈ పరిస్థితి ఉత్పన్నం కావొచ్చు.
* 7.2 లక్షల రోజువారీ కేసులతో ఈ నెల 23న మూడో ఉద్ధృతి పతాక స్థాయికి చేరొచ్చని ఈ నెల 11 వరకూ వెలువడిన డేటాను విశ్లేషించినప్పుడు స్పష్టమైంది. అయితే కేసుల వాస్తవ గమనంలో ఇప్పటికే వైరుధ్యం చోటుచేసుకుంది. దీంతో పతాక స్థాయికి చేరిన రోజున కొత్త కేసుల సంఖ్య 4 లక్షలకు మించకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి