Mekapati Goutham Reddy: గౌతమ్‌రెడ్డి శాఖలు ఎవరికి?

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఇంతకాలం ఆయన బాధ్యతలు నిర్వర్తించిన శాఖలు ఇప్పుడు ఎవరికి ఇవ్వనున్నారనేది చర్చనీయాంశమైంది. ఐటీ, పరిశ్రమలు-వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్‌ నిర్వర్తించేవారు.

Updated : 27 Feb 2022 07:21 IST

వైకాపా వర్గాల్లో చర్చ

ఈనాడు, అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఇంతకాలం ఆయన బాధ్యతలు నిర్వర్తించిన శాఖలు ఇప్పుడు ఎవరికి ఇవ్వనున్నారనేది చర్చనీయాంశమైంది. ఐటీ, పరిశ్రమలు-వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్‌ నిర్వర్తించేవారు. ఇప్పుడీ శాఖల బదలాయింపు విషయంలో రెండు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ శాఖలను వేరే మంత్రులకు బదలాయించడం లేదా కొద్దికాలం వీటిని సీఎం వద్దే ఉంచి త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో ఇతర మంత్రులకు సర్దుబాటు చేయడమనేదే ఈ ప్రతిపాదనల సారాంశమని అంటున్నారు. ఇప్పుడే బదలాయిస్తే 5 శాఖలనూ ఒకరికేనా లేదా వేర్వేరు మంత్రులకు కేటాయిస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌లకు గౌతమ్‌ చూసిన శాఖలను పంచే అవకాశం ఉందన్న చర్చ వైకాపా వర్గాల్లో జరుగుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవనున్నందున అంతకంటే ముందుగానే ఈ శాఖల బాధ్యులను ఖరారు చేయనున్నారని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని