ఉద్యోగులకు విందు భోజనం, తాయిలాలు.. వైకాపా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

ఎన్నికల వేడి మొదలైన వేళ వైకాపా నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకొనేందుకు గురువారం పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Updated : 23 Jun 2023 09:26 IST

నరసరావుపేట, న్యూస్‌టుడే: ఎన్నికల వేడి మొదలైన వేళ వైకాపా నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకొనేందుకు గురువారం పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉద్యోగులందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ గోడ గడియారాలు అందజేశారు.సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులే కీలకమని, రాబోయే రోజుల్లో మరింత సమర్థంగా పనిచేయాలని కలెక్టరు లోతేటి శివశంకర్‌ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు