CM Jagan Public Meeting: ఒంటేలుకు పోవాలన్నా వదల్లేదు!
సీఎం సభలు జరిగిన ప్రతిచోటా ప్రసంగం ఆరంభం, మధ్యలోనే జనం బయటకు వెళ్లిపోతుండటంతో.. పుట్టపర్తి సభలో ఇలా జరగకుండా నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఏకంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారు.
సీఎం సభ నుంచి వెళ్లకుండా అడ్డగింత
ఒక్కో గ్యాలరీకి అధికారి.. ఇద్దరు వాలంటీర్లు
మండిపడిన ప్రజలు.. బారికేడ్లు తోసుకుని వెళ్లిన వైనం
ఈనాడు డిజిటల్, అనంతపురం -న్యూస్టుడే, పుట్టపర్తి, బుక్కపట్నం: సీఎం సభలు జరిగిన ప్రతిచోటా ప్రసంగం ఆరంభం, మధ్యలోనే జనం బయటకు వెళ్లిపోతుండటంతో.. పుట్టపర్తి సభలో ఇలా జరగకుండా నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఏకంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీని పర్యవేక్షించేందుకు మండల స్థాయి అధికారి, ఓ ప్రజాప్రతినిధి, సచివాలయం ఉద్యోగితో ఇద్దరేసి వాలంటీర్లను నియమించారు. ఉదయం 8:30 గంటల నుంచే గ్యాలరీల్లో జనాన్ని కూర్చోబెట్టారు. 11:15 గంటలకు సీఎం వేదిక పైకి చేరుకున్నారు. 11:45కు ప్రసంగం ప్రారంభించారు. అన్ని గంటలపాటు గ్యాలరీల్లో కూర్చోలేక వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నా కనికరం చూపలేదు. అత్యవసరంగా వెళ్లాలని ఓ వృద్ధుడు వేడుకున్నా వదలకపోవడంతో గ్యాలరీ లైన్లోనే మల విసర్జన చేసుకున్నారు. అత్యవసరాలు తీర్చుకోవడానికీ బయటకు వెళ్లకూడదా అంటూ వృద్ధులు, మహిళలు పోలీసులపై మండిపడ్డారు. ఎంతసేపు బతిమాలినా కనికరించకపోవడంతో జనాలు సహనం కోల్పోయారు. రెండువైపులా బారికేడ్లను తోసుకుని సభ నుంచి బయటకు వెళ్లారు. సీఎం ప్రసంగం ప్రారంభమయ్యేసరికి 2 గ్యాలరీలు ఖాళీ అయ్యాయి. బారికేడ్ల బంధనాలు తొలగిపోవడంతో సీఎం ప్రసంగిస్తుండగానే సగం మంది ఇంటిబాట పట్టారు.
- పుట్టపర్తి పట్టణ శివారులోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి సమీపాన సీఎం సభ ఏర్పాటు చేశారు. కాన్వాయ్ కోసం గంట ముందునుంచే ఆ కూడలిలో వాహనాలను నిలిపివేశారు. దీంతో రోగులు, వారి సహాయకులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అవస్థలు పడాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
-
2,705 ‘అసెంబ్లీ’ నామినేషన్ల ఆమోదం
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం జరిగిన నామినేషన్ల పరిశీలన తర్వాత 175 శాసనసభ స్థానాలకు మొత్తం 2,705 నామినేషన్లను ఆమోదించగా.. 939 నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!