YSRCP: మనవి చేర్చు.. ప్రతిపక్షానివి తీసేయ్: స్థానిక నేతకు వైకాపా ఎమ్మెల్యే ఆదేశం
పల్నాడు జిల్లాలో కృష్ణా తీర ప్రాంతానికి చెందిన, గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక అనధికారిక దోపిడీని పర్యవేక్షించిన వైకాపా ఎమ్మెల్యే... పార్టీ గ్రామస్థాయి నాయకుడు ఒకరికి ఫోన్లో కులాలవారీగా ఓటర్ల వివరాలు చెప్పి, ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలంటూ చేసిన ఫోన్ సంభాషణ శనివారం బహిర్గతమైంది.
ఈనాడు, అమరావతి: పల్నాడు జిల్లాలో కృష్ణా తీర ప్రాంతానికి చెందిన, గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక అనధికారిక దోపిడీని పర్యవేక్షించిన వైకాపా ఎమ్మెల్యే... పార్టీ గ్రామస్థాయి నాయకుడు ఒకరికి ఫోన్లో కులాలవారీగా ఓటర్ల వివరాలు చెప్పి, ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలంటూ చేసిన ఫోన్ సంభాషణ శనివారం బహిర్గతమైంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైన ఆ సంభాషణలో... గ్రామంలో లేని కాపు సామాజికవర్గం వారి ఓట్లు వెంటనే తొలగించేలా అధికారులతో గట్టిగా మాట్లాడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతిపక్షాలకు చెందినవారు పొరుగూరులో ఉన్నా తీసివేతకు దరఖాస్తులు పెట్టాలని సూచించారు. వైకాపా మద్దతుదారులు పొరుగూరులో ఉంటున్నా చేర్పించాలని ఆదేశించారు. వైకాపాకు ఓటు వేయరనుకున్నవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు అధికారపార్టీ నాయకులు చేస్తున్న కుయుక్తులకు ఆ సంభాషణే నిదర్శనం. వారి సంభాషణ ఇలా సాగింది.
ఎమ్మెల్యే : మీఊరిలో వడ్డెర్ల ఓట్లు ఎన్ని ఉంటాయి?
గ్రామస్థాయి వైకాపా నేత: 460 ఉన్నాయి సర్.
ఎమ్మెల్యే : అన్ని లేవే
వైకాపా నేత : పొరుగూరిలో ఉన్నవారితో కలిపి అన్ని ఉంటాయ్ సర్...
ఎమ్మెల్యే : ఇక్కడ జాబితాలో 375 ఉన్నాయి, అందులో మనకు ఎన్ని ఉంటాయి?
వైకాపా నేత : మనకు 250 పక్కా పడతాయి సర్.
ఎమ్మెల్యే : మాల ఓట్లు పరిస్థితి ఏంటి... 229 ఉన్నాయి.
వైకాపా నేత : మనకే ఎక్కువగా ఉంటాయి. 150 వరకు మనకే ఉంటాయి.
ఎమ్మెల్యే : బోయవాళ్లు....
వైకాపా నేత : 170 నుంచి 180 ఉంటాయి.
ఎమ్మెల్యే : బోయలవి 150 ఉన్నాయి. మొత్తం మీ ఊళ్లో ఉన్నవి 1000 ఓట్లే కదా?
వైకాపా నేత : బోయలవి చెరో సగం ఉంటాయి సర్.
ఎమ్మెల్యే : మాదిగ 73 ఉన్నాయి.
వైకాపా నేత : మనకు 30 ఉంటాయి సర్. ఎక్కువ తెదేపాకు ఉంటాయి.
ఎమ్మెల్యే : కాపుల ఓట్లు..?
వైకాపా నేత : ఇద్దరికీ చెరి సగం ఉన్నారు. రేపు ఎటు వేస్తారో తెలియదు.
ఎమ్మెల్యే : అవును కాపుల ఓట్లు ఎన్ని ఉన్నాయి ఊరిలో.. వాళ్లు ఊరిలో ఉండటం లేదంటగా.. పొరుగూరిలో ఉంటున్నారంటగా..
వైకాపా నేత : అవును సర్.. వాళ్లు చాలామంది బయటే ఉంటున్నారు. ఊరిలో రెండు కుటుంబాలే ఉంటున్నాయి.
ఎమ్మెల్యే : తీసేయాలి కదా వాళ్లవి.. తీసివేతలకు పెట్టలేదా?
వైకాపా నేత : పోయినసారి తీసివేతలకు పెట్టాము సర్. గొడవ జరిగి కొంతమంది ఉంచండి, కొందరు తీసేయాలని అంటున్నారు.
ఎమ్మెల్యే : కాపుల ఓట్లు తీసేయండి. తీసేయాలని పెట్టి నోటీసులు ఇవ్వాలని తహసీల్దారుకు చెప్పండి. ఇవాళే వెళ్లు.. తహసీల్దారు దగ్గరకు వెళ్లి గట్టిగా మాట్లాడండి.
వైకాపా నేత : సరే సర్.. ఈ రోజు ఆదివారం రేపు వెళతాను.
ఎమ్మెల్యే : నోటీసులు ఇవ్వండి, వస్తే ఉంచండి లేకపోతే తీసేయాలని చెప్పండి. కాపులవి ఎన్ని ఉంటాయి.
వైకాపా నేత : 70లోపు ఉంటాయి. చెరో సగం ఉంటాయి సార్. కాకపోతే రేపు పవన్ కల్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.
ఇలా మిగతా కులాలకు సంబంధించిన ఓట్ల వివరాల్ని కూడా ఆరా తీశాక...
ఎమ్మెల్యే : ఇప్పుడు ఊరిలో లేని అవతలి వాళ్లవి మొత్తం తీసివేయడానికి పెట్టేసేయండి.. మనవి పొరుగూరిలో ఉన్నా వారి ఓట్లు వెంటనే చేర్చండి, వెంటనే ఆ పని చేయండి.
వైకాపా నేత : సరే సర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం