Prakasam: రాష్ట్ర సారథీ.. ఇదా వారధి!
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని దేశిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో సాగర్ కాలువపై నిర్మించిన వంతెన 2022 ఫిబ్రవరి 27న కూలిపోయింది.
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని దేశిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో సాగర్ కాలువపై నిర్మించిన వంతెన 2022 ఫిబ్రవరి 27న కూలిపోయింది. అప్పటి నుంచి స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, అధికార పార్టీ నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు. చందవరం, దేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 2500 మంది ప్రజలు, సుమారు 3 వేల పశువులు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించిన సాగుభూమి కాలువకు అవతలివైపు ఉంది. పశువులకు మేత కావాలంటే అటువైపే వెళ్లాల్సిన పరిస్థితి. రైతులు కొన్ని రోజులు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక వంతెన నుంచి వెళ్లేవారు. ఆ మార్గంలో పశువులను తోలుకొని వెళ్లడానికి ఎక్కువ సమయంతో పడుతుండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో కూలిన వంతెనపైనే కర్రలు ఆసరాగా ఏర్పాటు చేసుకొని ఇలా రాకపోకలు సాగిస్తున్నారు. పశువులు జారిపడి కాళ్లు విరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వారం క్రితం పశువుల కాపరి నీటిలో పడిపోయారు. ప్రస్తుతం కాలువలో నీరు తక్కువగా ఉన్నందున కూలిన వంతెన పైనుంచి పారడం లేదు. ఎక్కువగా వచ్చినపుడు ఇటు వెళ్లలేరు. దీనిపై ఎన్నెస్పీ ఏఈ కేశవరావును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. వంతెన పునర్నిర్మాణానికి రూ.1.70 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. నిధులు వచ్చిన వెంటనే పనులు మొదలు పెడతామని చెప్పారు.
న్యూస్టుడే, దొనకొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
అనుమతుల పొడిగింపు రుసుములపై వివాదం
ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పొడిగింపు రుసుముల చెల్లింపుపై ఉన్నత విద్యామండలి, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల మధ్య వివాదం కొనసాగుతోంది. -
మాతృ మరణాల్లో సిజేరియన్ కేసులే అధికం
మాతృ మరణాల్లో సిజేరియన్ చేయించుకున్నవారు అధికసంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 362 మాతృ మరణాలు చోటుచేసుకున్నాయి. -
రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
ప్రాథమిక వివరాల ఆధారంగా పంటనష్టం జాబితాలు
కోతలు పూర్తయినా పొలంలో పంట ఉన్నప్పుడు తీసుకున్న నష్టం వివరాల ఆధారంగా పంటనష్టం గణన పూర్తిచేసి జాబితాలు తయారుచేస్తామని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. -
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన
తాము వెళ్లాల్సిన విమాన సర్వీసును రద్దుచేయడంతో రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. -
మంత్రి పెద్దిరెడ్డి అండతో నరేగా సంచాలకులుగా మరోసారి చినతాతయ్య
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) సంచాలకులు చినతాతయ్య పదవీకాలం ఈ నెలలో ముగియనుండగా.. మరో ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించింది. -
డాక్టర్ లోకేశ్ కేసు నమోదుకు అనుమతివ్వండి
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శాటిలైట్ ఫోన్తో వచ్చారన్న ఆరోపణలపై ప్రవాస వైద్యుడు డాక్టర్ ఉయ్యూరు లోకేశ్పై కేసు నమోదుకు అనుమతివ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు సోమవారం స్థానిక కోర్టును ఆశ్రయించారు. -
భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన సీఎస్
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
రాష్ట్రానికి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్