Lakhimpur Kheri Case: ఈ జాప్యం ఉద్దేశపూర్వకం అనిపిస్తోంది
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ఖేరి ఘటన దర్యాప్తు తీరుపట్ల సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని, ఆ అభిప్రాయాన్ని మార్చేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది
ఆ అభిప్రాయం ముందు పోగొట్టండి
లఖింపుర్ ఖేరి కేసులో నిలదీసిన సుప్రీంకోర్టు
విచారణ అంతులేని కథలా సాగకూడదు
బాధితులకు, సాక్షులకు భద్రత కల్పించండి: సీజేఐ జస్టిస్ రమణ
ఈనాడు, దిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ఖేరి ఘటన దర్యాప్తు తీరుపట్ల సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని, ఆ అభిప్రాయాన్ని మార్చేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది. సాక్షుల నుంచి సెక్షన్-164 కింద వాంగ్మూలాల నమోదును వేగవంతం చేయాలని, వారికి తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. అక్టోబరు 3న జరిగిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్మిశ్ర కుమారుడు ఆశీష్ మిశ్ర వాహనాలు దూసుకెళ్లడం వల్ల నలుగురు రైతులు మృతి చెందడం, అనంతరం జరిగిన ప్రతీకార హింసలో మరో నలుగురు చనిపోయిన ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున స్థాయీ నివేదికను సీనియర్ న్యాయవాది హరీశ్సాల్వే సమర్పించారు. 44 మంది సాక్షుల్లో నలుగురి వాంగ్మూలాలను సెక్షన్-164 కింద జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేశామని చెప్పారు. ‘మిగిలిన సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. నిందితుల పట్ల అధికారులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారన్న భావన ధర్మాసనం నుంచి ఇదివరకు వ్యక్తమైంది. ఇప్పుడు అందర్నీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు’ అని వివరించారు. ఇంతవరకు పదిమందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఘటన సమయంలో పెద్దసంఖ్యలో రైతుల గుంపు ఉన్నందున ఎవరేం చేశారన్న అంశంపై విచారణ చేపట్టడం కష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
రెండుగా విభజించి విచారించండి: సీజేఐ
యూపీ వాదనపై సీజేఐ స్పందిస్తూ.. రైతులపైకి వాహనం నడపడం, ఆ తర్వాత రైతులు కొందర్ని కొట్టి చంపడం అనే రెండు కేసులను విభజించి, వేర్వేరుగా విచారణ చేపట్టాలని సూచించారు. స్థాయీ నివేదిక కోసం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు తాము ఎదురుచూసినా రాలేదని, కేసు విచారణకు ముందు సీల్డ్ కవర్లో అందించారని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్టులు వంటి అంశాలపై వాదప్రతివాదనలు జరిగాయి. ఒక దశలో జస్టిస్ రమణ స్పందిస్తూ ‘ఇది అంతులేని కథలా ఉండకూడదు’ అన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో, పోలీసు కస్టడీలో ఎంతమంది ఉన్నారో తెలియాలని, వారందర్నీ విచారిస్తే గానీ పోలీసులకు సమాచారం రాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారం వ్యవధి ఇస్తే కేసు తాజా పరిస్థితి వివరిస్తామని హరీశ్సాల్వే చెప్పారు. సాక్షులందరి వాంగ్మూలాలు తీసుకోవాలని.. వారికి, బాధితులకు భద్రత కల్పించాలని సీజేఐ ఆదేశించారు. తదుపరి విచారణను 26కువాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న